'స్టార్టప్' సరికొత్త ఆలోచన: ఏటీఎంల వద్ద క్యూ కోసం హెల్పర్, గంటకు రూ.90
ఢిల్లీకి చెందిన స్టార్టప్.. 'బుక్ మై చోటు' ఏటీఎంల వద్ద క్యూలో నిలుచునేందుకు సహాయకులను అందిస్తోంది. ఇందుకు గంటకు రూ.90 తీసుకుంటున్నారు.
న్యూఢిల్లీ: నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన ప్రకటన చేసిన అనంతరం నోట్ల మార్పిడికి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో క్యూలో నిలబడే వారి కోసం ఓ స్టార్టప్ ముందుకు వచ్చింది.
ఢిల్లీకి చెందిన స్టార్టప్.. 'బుక్ మై చోటు' ఏటీఎంల వద్ద క్యూలో నిలుచునేందుకు సహాయకులను అందిస్తోంది. ఢిల్లీ - ఎన్సిఆర్ వద్ద ఈ సహాయకులను అందిస్తోంది. ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద వరుస కట్టేందుకు సహాయకులను ఏర్పాటు చేస్తోంది.

అయితే, ఇందుకు గంటకు రూ.90 తీసుకుంటున్నారు. సహాయకులు లోపలి దాకా వెళ్లరు. క్యూ లైన్ దగ్గరికి వెళ్లే దాకా నిలబడతారు. ఆ తర్వాత ఎవరికైతే డబ్బులు కావాలో వాళ్లు వెళ్తారు. కేవలం వారు క్యూలో మాత్రమే నిలుచుంటారు. ఈ స్టార్టప్ క్లీనింగ్, షిఫ్టింగ్, గ్రాసరీ షాపింగ్ కోసం కూడా సహాయకులను అందిస్తోంది.
రూ.500, రూ.1000 నోట్లు రద్దు ప్రకటన అనంతరం సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. క్యూలో నిలుచొని రద్దైన నోట్లతో కొత్త వాటిని మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు గంటకు రూ.90 తీసుకొని సహాయకులను నియమించే స్టార్టప్ వెలుగు చూసింది.
ఇక, బ్లాక్ మనీ ఉన్న వాళ్లు వివిధ పద్ధతుల్లో తమ వద్ద ఉన్న డబ్బును మార్చుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తోన్న విషయం తెలిసిందే. మొదట బంగారం కొనడం, ఆ తర్వాత నగదును డాలర్లలోకి మార్చుకోవడం.. ఇలా వివిద పద్ధతులు వినియోగించారు. ప్రభుత్వం అన్నింటి పైన దృష్టి సారించింది.
-
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications