దావూద్.. కేంద్రంతో టచ్ లోనే ఉన్నాడు: ఫేస్బుక్లో రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
1993 ముంబై పేలుళ్ల నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇండియాకు తిరిగి వచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చ
ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలిసారి ఫేస్బుక్లోకి వచ్చిన ఆయన.. ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు.
1993 ముంబై పేలుళ్ల నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇండియాకు తిరిగి వచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడని రాజ్ థాకరే తెలిపారు. అంతేకాదు అతన్ని ఇండియాకు తీసుకొచ్చి ఇది తమ విజయంగా బీజేపీ చెప్పుకొనే ప్రయత్నం చేయనుందని కూడా ఆయన చెప్పారు.

257 మంది మృతికి కారణమైన ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన దావూద్.. అప్పటి నుంచి పాకిస్తాన్లోని కరాచీలో తలదాచుకుంటున్నాడు. మూడు ఖండాల్లోని 12 దేశాల్లో అతని నెట్వర్క్ విస్తరించి ఉంది.
ఫేస్బుక్లోకి ఇవాళే ఎంటరైన రాజ్ థాకరే.. బీజేపీపై మరిన్ని ఆరోపణలు చేశారు. ఈవీఎంలను బీజేపీ రిగ్ చేసిందని కూడా ఆరోపించారు. ప్రతి ఓటు బీజేపీకి వెళ్తుంటే.. ఎన్నికల్లో పోటీ చేసి లాభం లేదని ఆయన అన్నారు.
థాకరే ఫేస్బుక్లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన ప్రొఫైల్కు 4.39 లక్షల లైక్స్, 4.43 లక్షల మంది ఫాలోవర్లు రావడం విశేషం. పార్టీ కార్యకర్తలతో టచ్లో ఉండటానికే ఫేస్బుక్లోకి వచ్చినట్లు థాకరే చెప్పారు.
-
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..! -
పెట్రోల్, గ్యాస్ సంక్షోభం.. దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్..?? -
2 వారాల పాటు పాఠశాలలకు సెలవులు.. కారణం ఇదే.. -
మొబైల్ డేటాపై కేంద్రం పన్ను? GB పై ఎంత ట్యాక్స్? -
భారత్ గెలిస్తే ఏంటట: పాకిస్తానోళ్లు కడుపు మంటతో పోయేట్టున్నారయ్యో -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు











Click it and Unblock the Notifications