ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి: లండన్లో ఆకస్మిక ల్యాండింగ్
ఎయిర్ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఓ పక్షి ఢీకొనడంతో విమానాన్ని వెంటనే ల్యాండ్ చేశారు. అహ్మాదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానానికి ఈ ఘటన చోటుచేసుకుంది.
లండన్: ఎయిర్ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఓ పక్షి ఢీకొనడంతో విమానాన్ని వెంటనే ల్యాండ్ చేశారు. అహ్మాదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానానికి ఈ ఘటన చోటుచేసుకుంది.
లండన్లోని హీత్రూ విమానాశ్రయంలో విమానం దించారు. పక్షి ఢీకొనడంతో విమానం ముక్కు భాగం లోపలికి వెళ్లిపోయింది. దీంతో పాటు ఆ విమానానికి చెందిన రాడార్ వ్యవస్థ కూడా దెబ్బతింది. వాస్తవానికి ఎయిర్ ఇండియా విమానం అహ్మాదాబాద్ నుంచి అమెరికాలోని నెవార్క్ వెళ్లాల్సి ఉంది.

అయితే లండన్లో ఈ విమానం నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసింది. బుధవారం ఈ ఘటన జరిగింది. ఘటన జరిగినప్పుడు ఆ విమానంలో సుమారు 230 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతం విమానానికి రిపేర్ జరుగుతోందని, లండన్ నుంచి ప్రయాణికులను అహ్మదాబాద్ తీసుకొస్తుందని అధికారులు తెలిపారు.
More From
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications