రాసిస్తేనే..: టీబిల్లుపై దిగ్విజయ్, పటేల్లతో వెంకయ్య
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో సీమాంధ్రకు ఏ విధమైన న్యాయం చేస్తారో లిఖితపూర్వకంగా ఇస్తేనే పార్టీలో చర్చించి తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో మద్దతు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు కాంగ్రెసు అధిష్టానం పెద్దలకు చెప్పారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్, కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ శుక్రవారం వెంకయ్యనాయుడిని కలిశారు.
బిజెపిని ఒప్పించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని వారిద్దరు వెంకయ్యనాయుడిని కోరారు. సీమాంధ్రకు న్యాయం చేసే ప్రతిపాదనలు తాము చేశామని దిగ్విజయ్, అహ్మద్ పటేల్ వెంకయ్యనాయుడికి చెప్పారు.

సీమాంధ్రకు న్యాయం చేయడానికి చేసిన ప్రతిపాదనలపై తమకు లిఖితపూర్వకంగా ఇవ్వాలని, అధికారికంగా తమకు అది ఇవ్వాలని, అప్పుడే తాము పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చించి. మద్దతుపై ప్రకటన చేస్తామని వెంకయ్య నాయుడు వారితో చెప్పారు. నోటి మాటలు సరిపోవని వెంకయ్యనాయుడు వారితో చెప్పారు. సీమాంధ్ర కోసం చేసిన ప్రతిపాదనలను తమకు అధికారికంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, కేంద్ర మంత్రుల బృందం (జివోఎం) సభ్యుడు జైరాం రమేష్ గురువారం రాత్రి వెంకయ్య నాయుడితో సమావేశమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నివేదికపై చర్చించారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications