ఈ రోజు గర్వంగానే ఉంది కానీ: పాక్ బలగాల దుశ్చర్యకు బలైన జవాను కొడుకు
న్యూఢిల్లీ: బీఎస్ఎఫ్ జవాన్ నరేందర్ కుమార్ గొంతు కోసి దారుణంగా పాకిస్తాన్ ట్రూప్స్ చంపేసిన విషయం తెలిసిందే. జవాను గొంతు కోసి, కనుగుడ్లు పీకేసి దూరంగా విసిరేశారు. దీనిపై జవాన్ నరేంద్ర కుమార్ తనయుడు స్పందించారు.
Recommended Video

నా తండ్రి దేశం కోసం ప్రాణాలు అర్పించాడని, ఈ రోజు తమకు చాలా గర్వంగా అనిపిస్తోందని, కానీ రేపటి మా పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ కుటుంబానికి ఎవరు దిక్కని అడిగారు. ఇది తమకు గర్వం కలిగించే విషయమని, దేశం కోసం ఇలా ప్రాణాలు అర్పించే అవకాశం అందరికీ రాదని, దీనిపై గర్వపడుతూనే ఉండలేమన్నారు.
ఈ రోజు గర్వంగా ఉందని,రేపు ఇంకొకరు మరణిస్తారని, మళ్లీ గర్వంగా అనిపిస్తుందని, రెండు మూజు రోజుల తర్వాత ఏం జరుగుతుందని, తమకు ఎలాంటి సాయం అందదని, నేను, నా సోదరుడు నిరుద్యోగులమని, మాకు ఉన్న ఒకే ఒక్క ఆధారం తన తండ్రి... ఆయన చనిపోయారని, మాకు కావాల్సిన సాయాన్ని అధికారులు అందించాలని కోరారు.

పాకిస్తాన్ ట్రూప్స్ చేతుల్లో చనిపోయిన నరేందర్ కుమార్ స్వస్థలం హర్యానాలోని సోనిపట్. 1990లో బీఎస్ఎఫ్లో చేరారు. భార్య సంతోష్ దేవి. ఇధ్దరు కొడుకులు మోహిత్ కుమార్, అంకిత్ కుమార్.
జమ్ము వద్ద రామగఢ్ సెక్టారులో సరిహద్దు భద్రతాదళ హెడ్ కానిస్టేబుల్గా ఉన్న అతనిని పాక్ ట్రూప్స్ చంపేశాయి. అతనిని అపహరించి, మూడుసార్లు తుపాకీతో కాల్చి, ఘోరంగా గొంతు కోసి ప్రాణం తీశాయి. దీనిపై అధికారులు వెంటనే స్పందించారు.
-
నా ఆస్తులు చూసి నేనే షాకయ్యా: తనికెళ్ల భరణి సెటైర్లు! -
నన్ను బలిపశువును చేస్తున్నారు! -
T20 World Cup Final: సౌతాఫ్రికాతో పైనల్ వీళ్లకే- పాక్ మాజీ కెప్టెన్ జోస్యం..! -
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
ఇరగదీశావ్ పో..: రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ మెగాస్టార్ ఫిదా -
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త పథకం అమల్లోకి..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
ఓటీటీలోకి కిర్రాక్ కామెడీ మూవీ.. పొట్టు పొట్టు నవ్వుకోండి..! -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
చంద్రగ్రహణం కారణంగా కలిసొచ్చే రాశులు, కష్టాలొచ్చే రాశులు ఇవే!












Click it and Unblock the Notifications