భారత్ డ్రోన్లు కూల్చేశాం, భారత్కే ఎక్కువ నష్టం: పాక్
నియంత్రణ రేఖను దాటి తమ భూభూగంలోకి చొరబడిన భారత డ్రోన్లను కూల్చివేసామని పాకిస్తాన్ సైన్యం శనివారం నాడు ప్రకటించింది.
కరాచీ: ఎల్వోసీని దాటి తమ భూభూగంలోకి చొరబడిన భారత డ్రోన్లను కూల్చివేసామని పాకిస్తాన్ సైన్యం శనివారం నాడు ప్రకటించింది. పాక్ భూభాగంలోకి ప్రవేశించిన భారత క్యాడ్కాప్టర్లను పాక్ దళాళు సాయంత్రం కూల్చాయని, దాని శకలాలు రాక్ చక్రి సెక్టారులోని అగాయ్ పోస్టు సమీపంలో పడ్డాయని ఓ ఆర్మీ అధికారి తెలిపారు.
అగాయ్ పోస్ట్ వద్ద ఎల్వోసీని దాటి 60 మీటర్ల మేర వచ్చిన భారత్కు చెందిన డ్రోన్ను కూల్చివేశామని పాక్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ సలీం బజ్వా సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో వెల్లడించాడు.

నియంత్రణ రేఖ వెంబడి ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణల్లో పాకిస్థాన్కు చెందిన 20 మంది సైనికులు మరణించగా, భారత్లో 40మంది కన్నా ఎక్కువగా మరణించారని పాక్ సైన్యం ఉన్నతాధికారి లెఫ్టినెంట్ జనరల్ మాలిక్ జాఫర్ ఇక్బాల్ తెలిపారు. గిల్గిత్లో శుక్రవారం జరిగిన పార్లమెంటు సభ్యులు, విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు.












Click it and Unblock the Notifications