వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హిందూ మహాసముద్రం భారత్ పెరడు కాదు: చైనా
బీజింగ్: హిందూ మహాసముద్రం ఏమీ భారత్ ఇంటి వెనుక పెరడు వంటిది కాదని చైనా వ్యాఖ్యానించింది. చైనాలో భారత పాత్రికేయుల బృందం పర్యటిస్తోంది. ఈ సందర్భంగా సీనియర్ కెప్టెన్ ఝావో యి మాట్లాడారు.
హిందూ మహాసముద్రం ప్రాంతంలో, సౌత్ ఏషియా ప్రాంతంలో స్థిరత్వం కోసం భారత్ ప్రత్యేక పాత్ర పోషించవలసి ఉందన్నారు. అయితే, మరే ఇతర దేశాల నావికాదళాలు హిందూ మహాసముద్రంలో అడుగుపెట్టరాదని చెప్పేందుకు అది భారత్ ఇంటి వెనుక పెరడు వంటిదికాదన్నారు.
సొంత స్థలం మాదిరిగా హిందూ మహాసముద్రాన్ని పరిగణించరాదన్నారు. హిందూ మహసముద్రాన్ని భారత్ తమ పెరడుగా భావిస్తే... అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా తదితర దేశాలు దాని మీదుగా ఎలా వెళ్లగలవని ప్రశ్నించారు. కాగా, ఈ ప్రాంతంలో పట్టు కోసం చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం శ్రీలంకతో మైత్రికి ప్రాముఖ్యతను ఇస్తోంది.
Comments
English summary
China recognises India’s special role in stabilising the strategic Indian Ocean region but the perception that it is India’s “backyard” may result in clashes, Chinese military officials and experts have cautioned.
Story first published: Thursday, July 2, 2015, 15:32 [IST]