మొగదిషులో భారీ పేలుడు: 70 మందికిపైగా మృతి, 50మందికి తీవ్రగాయాలు
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ కారు బాంబు పేలుడు ఘటనలో 70 మంది మృతి చెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
పన్ను వసూలు కేంద్రమే లక్ష్యం చేసుకుని ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డారు. శనివారం ఉదయం రద్దీగా ఉన్న సమయంలోనే పేలుడు సంభవించడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన విడుదల చేయలేదు.

కానీ, సోమాలియాలో గత కొంత కాలంగా ఆల్ ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థ అయిన అల్ షబాబ్ తరచూ ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు, పేలుళ్లకు పాల్పడుతోంది. రద్దీగా ఉండే చెక్ పాయింట్లు, హోటళ్లను లక్ష్యంగా చేసుకుని గతంలో దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
2017లో జరిగిన ట్రక్కు బాంబు పేలుడు ఘటనలో 500 మందికిపైగా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ దాడికి అల్ షబాబే కారణమని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, తాజా పేలుడు ఘటనలో యూనివర్సిటీ విద్యార్థులు, పోలీసు అధికారులు, ఇద్దరు టర్కీష్ పౌరులు మృతి చెందారని పోలీసులు తెలిపారు.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications