ఘోర ప్రమాదం: లోయలో పడిన రైలు, 33మంది మృతి
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంధనం తీసుకెళ్తున్న ఓ రైలు ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో 33 మంది దుర్మరణం చెందారు.
లుబుంబాషి: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంధనం తీసుకెళ్తున్న ఓ రైలు ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ఘటనలో 33 మంది దుర్మరణం చెందారు.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 13 ఆయిల్ ట్యాంకర్లతో ఓ రైలు లుబుంబాషి నుంచి కటంగాలోని లుయేనా వెళ్తొంది. లుబుడి స్టేషన్ సమీపంలో ఈ రైలు అదుపుతప్పి లోయలో పడింది. రైల్లో ఆయిల్ ట్యాంకర్లు ఉండటంతో వెంటనే పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.దీంతో 33 మంది మృతి చెందారు.

సమాచారమందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. కాగా, మృతులంతా ఆ రైల్లో అక్రమంగా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోందని ఓసీనియర్ అధికారి తెలిపారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications