Crime News: తేలు కుట్టి యువతి మృతి.. ఆస్పత్రికి తీసుకెళ్లినా నిలవని ప్రాణం..
సాధారణంగా పాము కాటుకు గురై చనిపోతారు. కానీ తేలు కాటుకు గురై చనిపోవడం చాలా అరుదు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువతి తేలు కుట్టి చనిపోయింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడుకు చెందిన దొంతుల బాలమల్లు-పద్మ దంపతలకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో కూతురు మాలతి బీటెక్ పూర్తి చేసి ఇటీవలే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సాధించింది.
ఆమె త్వరలో కంపెనీల జాయిన్ కావాల్సి ఉంది. అయితే ఆదివారం తల్లిదండ్రులతో కలిసి తమ పొలం వద్దకు వెళ్లింది. అక్కడ తల్లిదండ్రులతో కలిసి పని చేస్తుండగా.. ఆమెకు తేలు కుట్టింది. ఆమెను వెంటనే సిరిసిల్లలోని ఆస్పత్రికి తరలించారు. అయితే మాలతి పల్స్ రేటు పడిపోతుండడంతో ఆమెను కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

రెండు రోజుల పాటు చికిత్స పొందిన మాలతి పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే సిరిసిల్లలోని ఏరియా ఆస్పత్రి సరిగా చికిత్స అందించలేకపోవడమే కారణమని స్థానిక బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications