చిత్రపురి కాలనీలో అక్రమాలు అంటూ ఆందోళన
హైదరాబాద్ : చిత్రపురి కాలనీ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని చిత్రపురి సాధన సమితి డిమాండ్ చేసింది. ఏపీ సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటి లిమిటెడ్ చట్టవిరుద్ధంగా భూమి కేటాయించారని ఆరోపించారు. దీనిని నిరసిస్తూ గత 50 రోజులుగా కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. ఇవాళ వీరికి బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వారికి సంఘీభావం తెలిపారు.

కమిటీ చర్యను నిరసిస్తూ ప్రెస్ క్లబ్ వద్ద తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కార్యక్రమం ఏర్పాటు చేశారు. హాజరైన నేతలు కార్మికుల నిరసనకు మద్దతు తెలిపారు. తమకు కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ప్రభుత్వం కేటాయించిన భూమిని కొందరు ప్రేవేట్ వ్యక్తులకు విక్రయించారని మండిపడ్డారు. 67 ఎకరాల భూమిని గద్దల్లా తన్నుకుపోయారని మండిపడ్డారు. కమిటీ సభ్యులు కార్మికులకు కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు గృహలను విక్రయించారని ఆరోపించారు.

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ .. చిత్రపురి సాధన సమితి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లానని హామీనిచ్చారు. ఈ సభలో చిత్రపురి సాధన సమితి అధ్యక్షుడు శ్రీనివాస్, నరసింహారెడ్డి,మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications