రిజర్వేషన్ల బిల్లుకు సభ ఆమోదం: కేంద్రాన్ని అర్థించం.. కోట్లాడుతాం: కేసీఆర్
గిరిజన, ముస్లీం రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది.
హైదరాబాద్: గిరిజన, ముస్లీం రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలను సభకు రానివ్వలేదు. బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు పలికాయి.
దీనిని గిరిజన, బీసీ-ఈ రిజర్వేషన్ల బిల్లుగా పేర్కొన్నారు. బీసీ-ఈ రిజర్వేషన్లను నాలుగు శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ నిర్ణయించారు. బీసీ-ఈ అంటే ముస్లీంలకు రిజర్వేషన్లు. గిరిజన రిజర్వేషన్లను ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచారు.

అంతకుముందు, కేసీఆర్ దీనిపై మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో తాము విజయం సాధిస్తామని చెప్పారు. తమిళనాడు తరహాలోనే బిల్లు ఉందని చెప్పారు. కానీ మక్కీకి మక్కీ ఉంటే బిల్లులు ఒప్పుకునే పరిస్థితి ఉండదన్నారు.
ఈ రిజర్వేషన్లపై అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి కూడా తీసుకు వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు. ఇప్పటికి చాలా కులాలు అభివృద్ధికి నోచుకోలేదని, రిజర్వేషన్లతో సమాజంలో సమతుల్యత వస్తుందన్నారు. రిజర్వేషన్లపై కేంద్రాన్ని అర్థించమని కేసీఆర్ తేల్చి చెప్పారు. అవసరమైతే లోకసభలో గొడవ చేస్తామన్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications