రిజర్వేషన్ల బిల్లుకు సభ ఆమోదం: కేంద్రాన్ని అర్థించం.. కోట్లాడుతాం: కేసీఆర్

గిరిజన, ముస్లీం రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది.

హైదరాబాద్: గిరిజన, ముస్లీం రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలను సభకు రానివ్వలేదు. బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు పలికాయి.

దీనిని గిరిజన, బీసీ-ఈ రిజర్వేషన్ల బిల్లుగా పేర్కొన్నారు. బీసీ-ఈ రిజర్వేషన్లను నాలుగు శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ నిర్ణయించారు. బీసీ-ఈ అంటే ముస్లీంలకు రిజర్వేషన్లు. గిరిజన రిజర్వేషన్లను ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచారు.

Increase in Reservation for Muslims, STs Bill passed TS assembly

అంతకుముందు, కేసీఆర్ దీనిపై మాట్లాడారు. రిజర్వేషన్ల విషయంలో తాము విజయం సాధిస్తామని చెప్పారు. తమిళనాడు తరహాలోనే బిల్లు ఉందని చెప్పారు. కానీ మక్కీకి మక్కీ ఉంటే బిల్లులు ఒప్పుకునే పరిస్థితి ఉండదన్నారు.

ఈ రిజర్వేషన్లపై అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి కూడా తీసుకు వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు. ఇప్పటికి చాలా కులాలు అభివృద్ధికి నోచుకోలేదని, రిజర్వేషన్లతో సమాజంలో సమతుల్యత వస్తుందన్నారు. రిజర్వేషన్లపై కేంద్రాన్ని అర్థించమని కేసీఆర్ తేల్చి చెప్పారు. అవసరమైతే లోకసభలో గొడవ చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+