మాకు అండగా నిలిచారు: సయీద్ మృతికి కెసిఆర్ సంతాపం, శ్రీనగర్కు మహమూద్ అలీ
హైదరాబాద్: జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సరుూద్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నేటిదాకా రాజకీయంగా తమకు ఎంతో అండగా నిలిచిన ముఫ్తీ మహ్మద్ సరుూద్ లేని లోటు వ్యక్తిగతంగా పూడ్చలేనిదని కెసిఆర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
వ్యక్తిగతంగా ముఫ్తీ మహ్మద్తో తనకు ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ డిమాండ్కు దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతున్న సమయంలో ముఫ్తీ మహ్మద్ సరుూద్ గట్టిగా సమర్థించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ ఉద్యమ సభకు ఆయన తన కూతురు మహబాబా ముఫ్తీని పంపించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ముఫ్తీ మహ్మద్ సరుూద్ అంత్యక్రియలకు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నానని, తెలంగాణ రాష్ట్రం తరఫున ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని పంపించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. ముఫ్తీ మృతి పట్ల కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూడా సంతాపం వ్యక్తం చేశారు.
జమ్మూకాశ్మీర్కు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
దివంగత జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీమొహమ్మద్ సయీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్అలీ శుక్రవారం శ్రీనగర్ వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గురువారం ఢిల్లీ చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం శ్రీనగర్కు బయలుదేరుతారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications