హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘరానా చైన్ స్నాచర్ పట్టివేత: తాళాలు పగులగొట్టి ఇంట్లో బంగారం చోరీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గొలుసు దొంగతనాల్లో ఆరితేరిన ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న మురళీకృష్ణ అనే వ్యక్తిని వనస్థలిపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2014 నుంచి వనస్థలిపురంతో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో మురళీ గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నాడు.

నిందితుడి నుంచి 25 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మురళీకృష్ణ 12 గొలుసు దొంగతనాల్లో నిందితుడు. వాహనాలు తనిఖీ చేస్తుండగా మురళీ పోలీసులకు దొరికిపోయాడు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.

 Noted chain snatcher nabbed by police

ఇదిలావుంటే హైదరాబాదులోని నాగోల్‌లోగల అరుణోదయనగర్‌లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న 38 తులాల బంగారం, రూ. 3 లక్షలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధిత కుటుంబం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

మహబూబ్‌నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుడు నరువ మండలం ఉందేకోడు గ్రామానికి చెందిన వెంకటయ్యగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Chain snatcher Murali Krishna has been nabbed by Vanasthalipuram police in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X