జేఎఫ్సీకి ఆదిలోనే 'హైదరాబాద్' షాక్: కేంద్రంపై పవన్ దూకుడు, ఆర్టీఐ దరఖాస్తు
హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ సమావేశాన్ని హైదరాబాదులో నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
చదవండి: మోడీ నటిస్తే కనుక, కేవలం మంత్రమే: పవన్ కళ్యాణ్ హోదా డిమాండ్కు జేపీ షాక్
సమస్యలు ఏపీకి చెందినవి అయితే హైదరాబాదులో సమావేశం నిర్వహించడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారట. పవన్ ప్రయత్నం మెచ్చుకోదగినదేనని, అయితే పక్క రాష్ట్రంలో ఏపీ సమస్యలపై చర్చించాల్సిన అవసరమేమిటని నిలదీస్తున్నారని తెలుస్తోంది.
చదవండి: పవన్తో కలిసి పని చేస్తానో లేదో, రాజకీయం అర్థం తెలియదు, నేనే రాజకీయాలు చేస్తున్నా: జేపీ

ఏపీ నుంచి పాలన సాగుతోంటే హైదరాబాదులోనా
పవన్ కళ్యాణ్ ఏపీలో తిరిగి సమస్యలు తెలుసుకోవాలని కొన్ని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారట. ఏపీ పరిపాలన కూడా నవ్యాంధ్ర నుంచే సాగుతోందని, ఇలాంటప్పుడు హైదరాబాదులో భేటీ నిర్వహించడం సరికాదని అంటున్నారని తెలుస్తోంది.

అందుకే హైదరాబాదులో నిర్వహణ
అయితే, ఈ జెఎఫ్సీ కేవలం ఏపీ సమస్యల కోసమే కాదని, రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల కోసం పోరాడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా జేఎఫ్సీ భాగమైన వివిధ రంగాలకు చెందిన నిపుణులు హైదరాబాదులో నివాసం ఉన్నారని, వారిలో పలువురు పెద్దవారు ఉన్నారని, వారికి ఇబ్బంది కలగకుండా ఈ సమావేశాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

20 మంది సంతకాలు
మరోవైపు, పవన్ నేతృత్వంలోని జేఎఫ్సీ నిధుల లెక్క కోసం సమచార హక్కు చట్టాన్ని ఆశ్రయించింది. ఏపీకి ఇచ్చిన నిధుల వివరాలు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగింది. విభజన చట్టం ప్రకారం వివిధ ప్రాజెక్టులకు ఇచ్చిన నిధుల వివరాలు తెలపాలని కోరింది. సహ హక్కు చట్టం దరఖాస్తుపై పవన్, జేపీ, ఉండవల్లి సహా 20 మంది సంతకాలు చేశారు.

వారంలో నిజాలు చెబుతాం
అంతకుముందు జేఎఫ్సీ సభ్యులు మాట్లాడుతూ... ప్రభుత్వాన్ని ఇప్పటికే వివరాలు అడిగామని, అవి వచ్చాక ప్రకటన చేస్తామని చెప్పారు. అధికారిక కేటాయింపులు, హామీల అమలుపై కేంద్రం ప్రకటన చేయాలన్నారు. రేపటి సమావేశాన్ని పద్మనాభయ్య ఏర్పాటు చేస్తారన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కోసమే జేఎఫ్సీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. వారంలో నిజాలు చెబుతామన్నారు.
-
యుద్ధంపై ప్రధాని మోదీ కీలక మీటింగ్.. సంచలన నిర్ణయాలు ఇవే.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications