సూరిని చంపి సినిమా చూసిన భాను
తన అనుచరుడు మన్మోహన్ సింగ్తో కలిసి అతను ఆ సినిమా చూశాడట. సూరి, రామ్ గోపాల్ వర్మ సూచన మేరకు భాను కిరణ్ 2010 డిసెంబర్లో సి. కళ్యాణ్, సింగనమల రమేష్లకు చెందిన బాలాజీ కలర్ ల్యాబ్ నుంచి రక్తచరిత్ర - 2 రీళ్లను బెంగళూర్ తీసుకుని వెళ్లినట్లు చెబుతున్నారు. బెంగళూర్లోని ఫోరం మాల్లో, మేక్రీలోని మరో థియేటర్లో ప్రివ్యూ షో కోసం వాటిని భాను తీసుకుని వెళ్లినట్లు సిఐడి విచారణలో తేలిందని చెబుతున్నారు.
ఆ స్థితిలోనే భాను కిరణ్తో లింక్స్ గురించి సిఐడి అధికారులు రామ్ గోపాల్ వర్మను ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముంబైలో తన ఫోటోతో ప్రచురితమైన వార్తను తెలుగు వార్తాపత్రికల్లో చదవడానికి భాను కిరణ్ ప్రయత్నించాడని కూడా తెలుస్తోంది.
సూరి మృతదేహం ఫోటో, ఆ పక్కనే తన ఫొటో చూసి వెంటనే తాను రేజర్ కొనుక్కుని సులభ్ కాంప్లెక్స్కు వెళ్లానని, బాత్రూంలో మీసాలు తొలగించుకున్నానని భాను కిరణ్ సిఐడి అధికారులకు చెప్పాడు. హైదరాబాదులో తాను పెద్ద వ్యక్తిని చంపానని, ఆ విషయం పోలీసులు తనను అరెస్టు చేస్తే చంపేస్తారని తాను మన్మోహన్ సింగ్కు చెప్పినట్లు అతను తెలిపాడు. ఏమైనా, భాను కిరణ్ వ్యవహారాలు కథలు కథలుగా ముందుకు వస్తూనే ఉన్నాయి.