అక్రమ సంబంధం వల్లే బిజినెట్ టైకూన్ హత్య?
దీపక్ భరద్వాజ్ చిన్న కుమారుడు నితేష్, అతని తల్లి రమేష్ కుమారి, న్యాయవాది బలజీత్ స్వామీజీగా చెప్పుకునే స్వామి ప్రతిభాదనంద్ను కలిశారు. హత్యకు కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ఉత్తరాఖండ్కు చెందిన ఓ మహిళతో ఉన్న వైవాహికేతర సంబంధమే అందుకు కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
ఆ మహిళను భరద్వాజ్ వివాహం చేసుకుంటాడని, దానివల్ల ఆయన అస్తి అంతా ఆమెకే చెందుతుందని భయపడి కుటుంబ సభ్యులు ఆయన హత్యకు పూనుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. భరద్వాజ్ హత్య కేసులో పోలీసులు ఇప్పటికే నితేష్ను, బలజీత్ను అరెస్టు చేశారు. భరద్వాజ్ హత్యకు తాము కుట్ర చేశామని వారిద్దరు అంగీకరించినట్లు చెబుతున్నారు.
భరద్వాజ్ హత్యకు బలజీత్ ఐదు కోట్ల రూపాయలు అడిగినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు డబ్బులు కావాలనే ఉద్దేశంతో అందుకు బలజీత్ అంగీకరించడాని, ఆ మొత్తాన్ని ఇవ్వడానికి నితేష్ అంగీకరించాడని పోలీసులు భావిస్తున్నారు. నితేష్ 50 లక్షల రూపాయలు ఇచ్చాడని, అందులో పది లక్షల రూీపాయలు ప్రతిభానంద్కు ఇచ్చాడని, దాంతో అతను ఇద్దరు కాంట్రాక్టు కిల్లర్లను ఏర్పాటు చేశాడని అంటున్నారు.
ప్రతిభానంద్ పరారీలో ఉన్నాడు. కారు, గన్స్ కొనుగోలుకు ప్రతిభానంద్ కాంట్రాక్ట్ కిల్లర్లకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. కాంట్రాక్టు కిల్లర్స్ పురుషోత్తమ్ రాణాను, సునీల్ మన్ను పోలీసులు అరెస్టు చేశారు.