చంద్రబాబు వేటు.. విదేశాలకు ధనంజయ జంప్? మరో శేఖర్ రెడ్డి అంటూ..
ఏర్పేడు ప్రమాద ఘటనపై అనుమానాలు, కుట్ర కోణాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏర్పేడు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ధనంజయ నాయుడు, ఆయన సోదరుడు చిరంజీవి నాయుడును టిడిపి నుంచి సస్పెండ్ చేశారు.
చిత్తూరు: ఏర్పేడు ప్రమాద ఘటనపై అనుమానాలు, కుట్ర కోణాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏర్పేడు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ధనంజయ నాయుడు, ఆయన సోదరుడు చిరంజీవి నాయుడును టిడిపి నుంచి సస్పెండ్ చేశారు.
ఇసుక అక్రమ రవాణా చేస్తూ అక్రమ సంపాదనతో రైతుల మనోభావాలు దెబ్బదతీసి, ఏర్పేడు వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆ ఇద్దరిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు టిడిపి అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరిట జిల్లా పార్టీ సోమవారం తెలిపింది.
వీరిద్దరిని టిడిపి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. అయితే, అంతలోనే ధనంజయులు విదేశాలకు పరారైనట్లుగా ప్రచారం సాగుతోంది. చిరంజీవి నాయుడు కూడా పరారీలో ఉన్నారని అంటున్నారు. గుణశేఖర్ అనే వ్యక్తి మాత్రం పోలీసులకు చిక్కాడు.

మరో శేఖర్ రెడ్డి అంటూ..
మరోవైపు, ధనంజయులుపై ప్రజాశక్తి పత్రిక ఓ కథనం రాసింది. 'మరో శేఖర్ రెడ్డి..'ధనంజయులు'' పేరుతో ఓ కథనం రాసింది. ఈ కథనంలో ఆయన ఆస్తులు రూ.200 కోట్ల మేర ఉన్నాయని, ఊళ్లో 54 ఏకరాలు కబ్జా చేశాడని, రోజుకు రూ.10 లక్షల ఇసుక వ్యాపారం చేసేవాడని పేర్కొంది.
450 ట్రాక్టర్లు, ఐదు లారీల ద్వారా చెన్నరు, బెంగుళూరుకు అక్రమంగా ఇసుక తరలిస్తూ ప్రతిరోజూ రూ.పది లక్షలకు పైగా ఆర్జిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అని పేర్కొంది. సొంతూళ్లోనే 54 ఎకరాలను కబ్జా చేసినట్లూ ఆయనపైనా, అనుచరులపైనా ఆరోపణలున్నాయని పేర్కొంది.

ఏకఛత్రాధిపత్యంగా..
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా ధనంజయులునాయుడు ఏలుతున్నాడనే మాట వినిపిస్తోందని పేర్కొంది. రేషన్కార్డు కావాలన్నా, పింఛను తీసుకోవాలన్నా ధనంజయులునాయుడు కనుసన్నల్లోనే యంత్రాం గం ఇదివరకు నడిచేదని జనాలు చెప్పుకుంటారని పేర్కొంది.

చంద్రబాబు హెచ్చరికతో..
ఏర్పేడు ఘటన దరిమిలా టిడిపి నుంచి ధనంజయులునాయుడు, చిరంజీవులు నాయుడులను సస్పెండ్ చేశారు. వారికి సహకరించిన అనుచరగణాన్ని కూడా వదిలేది లేదని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో వారు కేసు నుంచి తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తున్నారని పేర్కొంది.
ధనంజయులు నాయుడు బెంగుళూరు, చెన్నరు విమానాశ్రయాల నుంచి విదేశాలకు పరారైనట్లు మండల కేంద్రంలో చర్చ నడుస్తోందని పేర్కొంది. ఘటనకు కారకులైన గోవిందపురం సర్పంచి చిరంజీవినాయుడు, రవినాయుడు కూడా పరారీలో ఉన్నారని, కోబాకకు చెందిన గాలి గుణశేఖర్ నాయుడును పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారని పేర్కొంది. సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తహశీల్దారును సస్పెండ్ చేశారు. ఎస్సై పైనా వేటు పడనుంది.

కోట్లకు పడగెత్తిన వైనం..
ఏర్పేడు మండలం నుండి 2004లో జెడ్పీటీసీగా గెలుపొందిన ధనంజయులు నాయుడు అప్పట్లో సాధారణ రైతు. ఏర్పేడు మండలం గోవిందవరం సొంతూరు. స్వర్ణముఖి నది వీరి గ్రామాల వైపు పారడంతో ఇసుక అక్రమ వ్యాపారం వైపు మొగ్గు చూపాడని చెబుతుంటారు. రోజుకు 450 ట్రాక్టర్లలో ఇసుకను మూడు ప్రాంతాల నుంచి తరలించేవారని తెలుస్తోందని పేర్కొంది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications