డిమాండ్: జైలు నుంచి శశికళ ఎలా చక్రం తిప్పుతున్నారంటే..?
అన్నాడీఎంకే అధినేత్రి శశికళ అక్రమాస్తుల కేసుకు సంబంధించి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. ఆమె జైలు నుంచి తమిళనాడులో చక్రం తిప్పుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఆమె జైలుకు వెళ్లకముందు.. ముఖ్యమం
చెన్నై/బెంగళూరు: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ అక్రమాస్తుల కేసుకు సంబంధించి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. ఆమె జైలు నుంచి తమిళనాడులో చక్రం తిప్పుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఆమె జైలుకు వెళ్లకముందు.. ముఖ్యమంత్రి పదవి ఆశించారు. కానీ అది నెరవేరలేదు.
తన స్థానంలో పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేశారు. అలాగే పార్టీ నడిపే బాధ్యతలను దినకరన్కు అప్పగించారు. అయినప్పటికీ ఆమె జైలు నుంచి చక్రం తిప్పుతున్నారని చెబుతున్నారు.

ముఖ్యమైన డిమాండ్
జైలు అధికారులు ఆమెను వివిఐపి ఖైదీగా గుర్తించేందుకు నిరాకరించారు. అటాచ్డ్ బాత్రూం, కాట్, ఇంటి నుంచి భోజనం వంటి వాటిని అధికారులు నిరాకరించారు. అయితే, జైలు అధికారుల ముందు మాత్రం ఆమె ముఖ్యమైన డిమాండ్ పెట్టినట్లుగా చెబుతున్నారు. అదే తన పార్టీ వారిని కలవడం. ఎప్పటికప్పుడు తాను పార్టీ వారిని కలిసేందుకు అవకాశమివ్వాలని కోరారని అంటున్నారు.

31 రోజుల్లో 19 మంది కలిసినట్లుగా..
జైలు నిబంధనల ప్రకారం నెలకు ఇధ్దరు మాత్రమే ఆమెను చూడవచ్చు. అయితే, గత 31 రోజుల్లో ఆమెను 19 మంది కలిసినట్లుగా ఆర్టీఐ కార్యకర్త నరసింహ మూర్తి చెబుతున్నారు.
శశికళ భర్త నటరాజన్, లాయర్లు అప్పుడప్పుడు కలిసినట్లుగా చెబుతున్నారు. తంబీదురై, దినకరన్, ఎమ్మెల్యేలు వలరమతి, గోకుల ఇందిరా, సీఆర్ సరస్వతి వంటి వారు తరుచూ కలిసేవారిలో ఉన్నారని చెబుతున్నారు. మన్నార్ గుడి నుంచి గూడా పలువురు కలుస్తున్నారని చెబుతున్నారు. ఈ కలయిక ద్వారా రాజకీయ అంశాలు చర్చకు రావడం, ఆమె జైలు నుంచే చక్రం తిప్పడం జరుగుతోందంటున్నారు.

జైలు అధికారుల విచక్షణ
ఆర్టీఐ కార్యకర్త మూర్తి వెల్లడించిన వివరాలపై జైలు అధికారులు కూడా స్పందించారు. జైలులో ఉన్న వారు వారానికి ఓసారి కలవవచ్చునని చెప్పారు. డీజీపీ మాట్లాడుతూ.. నియమాలు ఉన్నాయని, అయితే కొన్ని జైలు అధికారుల విచక్షణతోను ఇలాంటి అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి శశికళను నేతలు తరుచూ కలుస్తున్నట్లుగా తెలుస్తోందంటున్నారు.

బెంగళూరు నగరానికి
బెంగళూరు నగరానికి చెందిన సామాజిక కార్యకర్త టి. నరసింహమూర్తి ఆర్టీఐ చట్టం కింద తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసును సుప్రీం కోర్టులో వాదించడానికి కర్ణాటక ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెట్టింది అనే పూర్తి వివరాలు ఇవ్వాలని అర్జీ సమర్పించారు. జయ ఆస్తుల కేసు వాదించేందుకు కర్నాటక ప్రభుత్వానికి రూ.2.79 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా వెల్లడయింది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications