జిఎస్టి ఎఫెక్ట్: టిటిడి డైరీ, క్యాలెండర్ ధరల పెంపు
తిరుమల: జిఎస్టి ప్రభావం అన్ని రంగాలపై కన్పిస్తోంది. ఆపద మొక్కుల వాడిగా పేరున్న వెంకటేశ్వరస్వామి దేవాలయంపై కూడ ఈ ప్రభావం కన్పిస్తోంది. లడ్డూలపై ఈ భారాన్ని ఎత్తివేయాలని టిటిడి కోరికను ప్రభుత్వం మన్నించింది.టిటిడి ప్రతి ఏటా ముద్రించే డైరీ, క్యాలెండర్ల ధరలను వచ్చే ఏడాది నుండి పెంచనున్నట్టు టిటిడి ప్రకటించింది.
వస్తు సేవల పన్ను భారం తిరుమల వెంకటేశ్వరుని భక్తులు ఎంతగానో ఇష్టపడే స్వామివారి క్యాలెండర్, డైరీలపై పడింది. వచ్చే సంవత్సరం క్యాలెండర్, డైరీల ధరలను భారీగా పెంచక తప్పడం లేదని టీటీడీ పేర్కొంది.

ఆయిల్ ప్రింటింగ్తో , నాణ్యంగా వీటిని ముద్రిస్తారు. 12 పేజీల శ్రీవారి క్యాలెండర్ ధరను రూ. 75 నుంచి 90కి పెంచుతున్నామని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో రూ. 100గా ఉండే డైరీ ధరను రూ. 120కి పెంచుతున్నట్టు ప్రకటించారు.
మరో వారంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు, ఈ నెల 23న తిరుమలకు వచ్చే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు వీటిని ఆవిష్కరించనున్నారు.ఆ తరువాత వీటిని భక్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచనున్నారు. జిఎస్టి ప్రభావం వల్లే డైరీలు, క్యాలెండర్ల ధరలను పెంచాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని టిటిడి ప్రకటించింది.
-
85,000 శ్రీవారి లడ్డూలు సిద్ధం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications