ఐటి రంగం మల్లగుల్లాలు
హైదరాబాద్ః అమెరికాలో టెర్రరిస్టులు సృష్టించిన బీభత్సం ప్రభావం ఐటి రంగంపై ఎంతమేరకు వుంటుందనే విషయంపై సరైన మదింపు వేయడానికి ఐటి పరిశ్రమ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
ఐటిరంగంపై అమెరికా పరిణామాల ప్రభావం స్వల్పకాలిక దృష్ట్యా చాలానే వుంటుందని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు హెచ్జె చౌధరి చెప్పారు. మధ్యకాలం, దీర్ఘకాలంలో ఈ ప్రభావంపెద్దగా వుండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మాంద్యంలో వున్న అమెరికా వచ్చే క్రిస్మస్నాటికి కోలుకునే అవకాశం వున్నదనిఅప్పటినుంచి ఐటి రంగానికి మళ్లీ మంచిరోజులు వస్తాయని ఇప్పటివరకు తామువిశ్వాసంతో వున్నామని ఆయన చెప్పారు.
టెర్రరిస్టుల దాడి వల్ల ఈ మంచిరోజులు మరో ఆరునెలలు వాయిదాపడే అవకాశం కనిపిస్తున్నదని ఆయన చెప్పారు. ఈ ఉత్పాతం నుంచి కోలుకున్న తర్వాత అమెరికాలోని బీమా సంస్థలు,ఎయిర్లైన్స్ సంస్థలు, రక్షణ సంస్థలు హైటెక్పై మళ్లీ కోట్లాది డాలర్లు ఖర్చుచేయాల్సివుంటుందని ఆయన అన్నారు.
హైదరాబాద్లోని
సుమారు
800
వందల
ఐటి
కంపెనీల్లో
కనీసం
ఏడు
వందల
కంపెనీలు
అమెరికా
వ్యాపారంపైనే
ప్రధానంగా
ఆధారపడి
వున్నాయి.
కొన్ని
చిన్న
కంపెనీలకు
ప్రత్యక్ష్యంగా
మరికొన్ని
కంపెనీలకు
పరోక్షంగా
ప్రాజెక్టులు
అమెరికానుంచేఅందుతుంటాయి.
హైదరాబాద్కు
చెందిన
సత్యం,
ఇన్పోటెక్
ఎంటర్ప్రైజెస్
వంటి
సంస్థలు
ఇప్పటికయితే
అమెరికాలో
వున్న
తమ
సిబ్బంది
క్షేమమని
ప్రకటించారు.
ఇంటెల్లీ
గ్రూప్
సిబ్బందికి
సంబంధించి
బుధవారం
నాడు
కొన్ని
వార్తలు
వచ్చిన
తమవారంతా
క్షేమంగా
వున్నట్టు
సంస్థ
ప్రకటించింది.విప్రో
ఉద్యోగుల్లో
నలుగురి
జాడమాత్రం
తెలియడం
లేదనివిప్రో
పేర్కొంది.
సంబంధితవార్తలుః
- లాడన్పైనే అమెరికా అనుమానం
- దాడులతోసంబంధం లేదన్న లాడెన్
- మన ఆర్థికరంగంపై ప్రభావం వుండదు: సిన్హా
- కార్యక్రమాలురద్దు చేసుకున్న ప్రధాని
- దాడులుమేమే చేశాం: లష్కర్
- అమెరికాపేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- అమెరికా పేలుళ్ళు-ఆంధ్రుల ఆందోళన
- మారణహోమంలో వేలాదిమంది దుర్మరణం?
- ముందేహెచ్చరించిన లాడెన్
- గాడాంధకారంలోఆంధ్రప్రదేశ్
- ప్రతీకారంతీర్చుకుంటాం: బుష్
- కాబూల్లోపేలుళ్లు మాపని కాదుఃయుఎస్
- అమెరికాఅగ్నిగుండమైన క్రమం...
- అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
-
భారత్దిగ్భ్రాంతి,
అత్యవసర
సమావేశం