వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరంగల్లో ఎంపిపి దారుణ హత్య
వరంగల్ః
వరంగల్
జిల్లాకు
చెందిన
చిట్యాల
మండల
ప్రజాపరిషత్
అధ్యక్షుడు
కాసర్ల
సురేందర్రెడ్డిని
గురువారం
నాడు
నక్సలైట్లు
దారుణంగా
కాల్చిచంపారు.
విద్యా కమిటి సమావేశంలో పాల్గొనేందుకు చిట్యాలకు వచ్చిన సురేందర్రెడ్డిపై నక్సల్స్ తుపాకీతో కాల్పులు జరిపారని తెలిసింది. ఈ కాల్పుల్లో మరో టీచర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు.
కాగా విద్యాశాఖాధికారి సుదర్శన్రెడ్డి ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపిపిగా గెలిచిన సురేందర్రెడ్డి వరంగల్లోనివాసం వుంటున్నారని తెలిసింది. విద్యాకమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చి ఆయన నక్సలైట్ల గుళ్లకు బలయ్యారు.
Story first published: Thursday, September 13, 2001, 23:53 [IST]