రావులపై బిజెపి సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడినందుకు ఆలంపూర్ శాసనసభ్యుడు డాక్టర్ రావుల రవీంద్రనాథ్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర శాఖ సస్పెండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనను బహిరంగ బలపరుస్తూ రవీంద్రనాథ్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని బిజెపి ఆరోపించింది. పార్టీ ఉపాధ్యక్ష పదవికి పార్లమెంటు సభ్యుడు నరేంద్ర చేసిన రాజీనామాను పార్టీ ఆమోదించింది.
రాష్ట్రాధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి అధ్యక్షతన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నరేంద్ర ఈ నెల 19వ తేదీన తలపెట్టిన తెలంగాణ ఫోరం సదస్సుపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. సిద్ధిపేట ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బలపరచాలని పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నరేంద్ర వ్యతిరేకించడంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది.
తెలంగాణ
అంశంపై
ఇచ్చిన
షోకాజ్
నోటీసుకు
సమాధానం
ఇవ్వకపోవడంతో
రవీంద్రనాథ్
రెడ్డిని
సస్పెండ్
చేశారు.
నరేంద్ర
విషయాన్ని
జాతీయ
అధ్యక్షుడు
జనా
కృష్ణమూర్తికి
నివేదించాలని
రాష్ట్ర
కార్యవర్గ
నిర్ణయించింది.
నరేంద్ర
పార్లమెంటుసభ్యుడు,
బిజెపి
పార్లమెంటరీ
పార్టీ
విఫ్
కావడంతో
రాష్ట్ర
కార్యవర్గం
ఆ
నిర్ణయం
తీసుకుంది.
తెలంగాణ
ఫోరం
సదస్సుకు
హాజరయ్యే
వారందరిపై
చర్య
తీసుకోవాలని
కార్యవర్గం
నిర్ణయం
తీసుకుంది.