ఎన్టీఆర్ కు హరికృష్ణ ఘన నివాళి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీఆర్కు ఆయన కుమారుడు హరికృష్ణ ఘన నివాళులు అర్పించారు. తండ్రి ఎన్టీఆర్ తో మిగితా కొడుకుల కంటే ప్రత్యేక అనుబంధం హరికృష్ణకు ఉంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్ధాపించి రాష్ట్రమంతటా పర్యటించినప్పుడు ఆయన చైతన్య రథానికి డ్రైవర్ హరికృష్ణే.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉదయం ఏడు గంటలకు ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న హరికృష్ణ తన తండ్రి సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. హరికృష్ణ వెంట పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు కూడా ఎన్టీఆర్ ఘాట్కు తరలివచ్చారు.
Story first published: Monday, January 19, 2009, 17:45 [IST]