Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేనే కింగ్‌ను: చిరంజీవి

Chiranjeevi
తిరుపతి: ఆరునూరైనా రాష్ట్రంలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడదని, రెండు విడతల్లోనూ ఆధిక్యత తమ పార్టీదేనని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ గురించి ప్రజలు ఏనాడో మరిచిపోయారని, కాంగ్రెసు ఓట్లు చీలిపోయాయని ఆయన అన్నారు. కాంగ్రెసు అవినీతిలో కూరుకుపోవడంతో ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారని ఆయన గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.2004లోనూ తామే అధికారంలోకి వస్తామని చంద్రబాబు అన్నారని, అప్పుడు ఆ పార్టీకి 46 సీట్లే వచ్చాయని ఆయన గుర్తుచేశారు.

కాంగ్రెస్‌ తో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నారన్న ఆరోపణలపై స్పందిస్తూ 'ఆ రెండు పార్టీలు అవినీతికి రెండు ముఖాలు. ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు, పెట్టుకున్న కేసుల్లో ఒక్కటీ ఆఖరి ఫలితాలను చూపకపోవడమే ఇందుకు నిదర్శనం.అయితే ఆ రెండు పార్టీలదే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అవుతుంది కానీ మాది కాదు' అన్నారు. రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరగలేదని, అంతా ద్విముఖమేనని ఇందులో ప్రజారాజ్యమే విజయం సాధిస్తుంద'ని ఆయన అన్నారు. అద్వానీ, మన్మోహన్‌సింగ్‌లేనా అని, వారికన్నా సమర్థులు ఎంతో మంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, అలాంటి వారికి ప్రజారాజ్యం మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు. అయితే బీజేపీ లాంటి మతతత్వ పార్టీలకు మాత్రం మద్దతు ఇవ్వబోమని ఆయన చెప్పారు. తిరుపతి, పాలకొల్లు రెండు స్థానాల్లో తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆయా స్థానాల్లో పీఆర్పీకి ప్రత్యర్థులే లేరన్నారు. రెండు స్థానాల్లో గెలిచిన తరువాత ఏదో ఒకటి వదులుకోక తప్పదని, అంత మాత్రాన ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టబోనని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+