వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాగంపై దాడి: శ్రీకాంత్ రాజు అరెస్టు
నల్లగొండ జిల్లా మాసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ రాజు, హైదరాబాదులోని నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా పెద్దఎల్కిచర్ల వాసి రాజీవ్ రెడ్డిలను పోలీసులు నాగంపై దాడి కేసులో నిందితులుగా గుర్తించారు. శ్రీకాంత్ రాజు అలియాస్ నాగరాజుకు నేరచరిత్ర ఉంది. ప్రజాపంథాలో కొంత కాలం పనిచేశారు. దాని నుంచి సస్పెండయ్యాడు. విజయశాంతి పెట్టిన తల్లి తెలంగాణ పార్టీ జిల్లా కన్వీనర్ గా వ్యవహరించాడు. రిలయన్స్ పెట్రోలు బంక్ లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడిన కేసులు అతనిపై ఉన్నాయి. ఒక్క నల్లగొండ జిల్లాలోనే అతనిపై 15 నుంచి 20 కేసులున్నాయి. ఒక కేసులో చర్లపల్లి జైలులో ఆరు నెలల శిక్ష కూడా అనుభవించాడు.
Story first published: Monday, December 28, 2009, 10:03 [IST]