ఇంటర్ విద్యార్ధి హత్య సంచలనం

దీంతో తన తమ్ముడి కుమారుడు పరీక్షలు రాసి ఇంతవరకు ఇంటికి చేరలేదని మధురమూర్తి పెదనాన్న కర్రి బ్రహ్మానందరావు ఈ నెల 27న రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూరల్ ఎస్ఐ సుబ్బారావు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి అదృశ్యంపై రూరల్ పోలీసులు రకరకాల కోణాల్లో దర్యాప్తు జరిపారు. కోటప్పకొండ వెనుకవైపు బండల కింద ఓ యువకుడి శవం ఉందని అందిన సమాచారంతో పోలీసులు వెళ్లి చూడగా మధురమూర్తి శవం గుర్తుపట్టలేని విధంగా కనిపించింది. మధురమూర్తి హత్యకు గురవడం పోలీసులను కూడా నిర్ఘాంతపరిచింది.
చివరి పరీక్ష రాసిన రోజే మధురమూర్తి తన స్నేహితుడు బలరామ్ ను 200 రూపాయలు అడిగినట్లు తెలుస్తోంది. దీంతో తనవద్దలేవని, సోదరుడి వద్ద ఇప్పిస్తానంటూ తీసుకెళ్లాడు. అప్పటికే మధురమూర్తి బలరామ్ కు 400 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయం తెలిసిన బలరామ్ సోదరులు ఇవ్వాల్సిన 400 రూపాయలు ఇవ్వలేదు, మళ్లీ 200 రూపాయల కోసం వచ్చావు.. ఎలా తీరుస్తావని ప్రశ్నించాడు. దానికి మధురమూర్తి తాను తన తండ్రికి ఒక్కడే కొడుకునని, 80ఎకరాల పొలం, బంగారం, ఇంకా ఆస్తి ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమాధానం విన్న తరువాత అక్కడ ఏం జరిగిందో తెలియదుగానీ మరికొందరితో కలిసి మధురమూర్తిని గొంతునులిమి హతమార్చినట్లుగా భావిస్తున్నారు.
-
అనసూయకు అవమానం..? వీడియో -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
మనకు మరో వందేభారత్, రెండు అమృత్ భారత్ ఖరారు- ఇక 3 గంటల్లోనే, రూట్..!! -
ఇక సెలవ్.. బీహార్ లో ముగిసిన నితీష్ శకం..!! -
వాంఖెడే ఈ నలుగురికీ కొట్టిన పిండే: అయినా డేంజర్- అచ్చిరాని పిచ్ -
Ind Vs Eng:సెమీస్ వేళ బ్యాటింగ్ లో మార్పులు, గంభీర్ కొత్త లెక్కలు - సెంటిమెంట్..!! -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో అద్దిరిపోయే రైల్వే స్టేషన్- ఆ జిల్లాకు బెటర్ కనెక్టివిటీ -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
T20 World Cup:సెమీస్ వేళ పఠాన్ కీలక సూచన-సౌతాఫ్రికాను కొట్టిన కివీస్ ప్లాన్..! -
నాగ చైతన్య నెవర్ బిఫోర్ అవతార్.. కేరీర్ బిగ్టెస్ట్ హిట్ ప్రామిస్












Click it and Unblock the Notifications