జెపిపై దాడి చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయి: నాదెండ్ల
సభలో ఉన్న వారి పని తీరు అందరికీ ఆదర్శంగా ఉండాల్సి ఉండాలన్నారు. సభ యొక్క ప్రాముఖ్యతను కాపాడాల్సిన బాధ్యతకు అందరికీ ఉందన్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నిన్నటి ఘటనలో శాసనమండలి చైర్మన్ చక్రపాణి కూడా గాయపడ్డారన్నారు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు అందరికీ ఉందని, కొందరి ప్రవర్తన సరిగా లేదన్నారు. ఫీజు రియింబర్స్మెంట్స్పై 22న స్వల్ప వ్యవధి చర్చ ఉంటుందని, ఇప్పటికే ప్రభుత్వం దానిపై ప్రకటన చేసిందన్నారు. సభా హక్కుల ఉల్లంఘనకు ఎవరూ పాల్పడినా నేరమే అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇలాంటి దుర్ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని అన్నారు.
నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ ఈటెల రాజేందర్ మల్లేష్ తెలంగాణ జయప్రకాశ్ నారాయణ హైదరాబాద్ nadendla manohar assembly mallesh telangana jayaprakash narayana hyderabad
English summary
Deputy Speaker Nadendla Manohar said that government will take action on MLAs, who attacked on Lok Satta
president Jayaprakash Narayana. He condemned attack on government also.
Story first published: Friday, February 18, 2011, 13:41 [IST]