తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీతో కిరణ్ కుమార్ రెడ్డి మంతనాలు

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితుల గురించి ఆయన ప్రణబ్ ముఖర్జీకి వివరించారు. తెలంగాణలో జరుగుతున్న ఉద్యోగుల సహాయ నిరాకరణ ఉద్యమం గురించి, తెలంగాణలో జరుగుతున్న ఇతర ఉద్యమాల గురించి ఆయన వివరించినట్లు సమాచారం. శాసనసభ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు అడ్డుకుంటున్న వైనం గురించి కూడా ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది. తెలంగాణపై కూడా ప్రణబ్ ముఖర్జీ కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడినట్లు చెబుతున్నారు. అయితే తెలంగాణపై ప్రణబ్ ముఖ్యమంత్రికి స్పష్టమైన వైఖరి ఏదీ చెప్పలేదని అంటున్నారు.

కాగా, కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తున్నారు. ఈ భేటీలో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై, అభ్యర్థుల ఖరారుపై మాట్లాడే అవకాశం ఉంది. అలాగే, తెలంగాణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ టికెట్లు ఆశిస్తున్న కాంగ్రెసు నాయకులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, వారు ఎక్కువగా కిరణ్ కుమార్ రెడ్డి కలవడం లేదు. ఆయన చేతుల్లో ఏమీ లేదనే ఉద్దేశంతో అధిష్టానం నాయకులకు దగ్గరగా ఉండే నాయకులతో పైరవీలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+