హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీతో కిరణ్ కుమార్ రెడ్డి మంతనాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితుల గురించి ఆయన ప్రణబ్ ముఖర్జీకి వివరించారు. తెలంగాణలో జరుగుతున్న ఉద్యోగుల సహాయ నిరాకరణ ఉద్యమం గురించి, తెలంగాణలో జరుగుతున్న ఇతర ఉద్యమాల గురించి ఆయన వివరించినట్లు సమాచారం. శాసనసభ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు అడ్డుకుంటున్న వైనం గురించి కూడా ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది. తెలంగాణపై కూడా ప్రణబ్ ముఖర్జీ కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడినట్లు చెబుతున్నారు. అయితే తెలంగాణపై ప్రణబ్ ముఖ్యమంత్రికి స్పష్టమైన వైఖరి ఏదీ చెప్పలేదని అంటున్నారు.

కాగా, కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తున్నారు. ఈ భేటీలో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై, అభ్యర్థుల ఖరారుపై మాట్లాడే అవకాశం ఉంది. అలాగే, తెలంగాణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ టికెట్లు ఆశిస్తున్న కాంగ్రెసు నాయకులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, వారు ఎక్కువగా కిరణ్ కుమార్ రెడ్డి కలవడం లేదు. ఆయన చేతుల్లో ఏమీ లేదనే ఉద్దేశంతో అధిష్టానం నాయకులకు దగ్గరగా ఉండే నాయకులతో పైరవీలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.

English summary

 Chief Minister Kirankumar Reddy met Union Minister Pranab Mukharjee today. It is said that Pranab discussed about Telangana issue with Kirankumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X