దొరల పెత్తనం వద్దు: కెసిఆర్పై మందకృష్ణ ధ్వజం

అయితే తెలంగాణ ప్రకటించి తమ జీవితాలను దొరల చేతిలో బలి పెట్టవద్దని అన్నారు. వర్గీకరణ అంశం తేలాక తెలంగాణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ కోసం అన్ని పార్టీలు ఢిల్లీ వెళ్లాలన్నారు. తెలంగాణ వచ్చాక దొరల దగ్గర జీతానికి పని చేసేందుకు తాము సిద్ధంగా లేమని అన్నారు. మా భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రకటించాలన్నారు. అంబేడ్కర్ దారిలో నడుస్తున్నామని చెప్పారు. ఇప్పటికీ దళితులు దొరల చేతిలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రిజర్వేషన్లలో బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల వాటా తేలాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా దాడులు అన్ని దళితులపైనే జరిగాయన్నారు. అగ్రవర్ణాలపైన దాడులు ఎక్కడా జరగలేదన్నారు.












Click it and Unblock the Notifications