కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనుమానంతో భార్యను చంపిన భర్త

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karimnagar District
కరీంనగర్: భార్యపై అనుమానంతో ఆమెను కడతేర్చిన సంఘటన కరీంనగర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా రామగుండంలో సతీష్ అనే వ్యక్తి తన భార్యపై అనుమానంతో ఆమె తలపై రాడుతో బాది హత్య చేశాడు. వీరికి ఏడేళ్ల క్రితం వివాహం అయింది. కొంతకాలం సంసారం సాఫీగానే సాగినప్పటికీ ఆ తర్వాత సతీష్ తన భార్యను నిత్యం వేధించేవాడు.

ప్రతిరోజు ఆమెను భర్త చిత్రహింసలకు గురి చేసేవాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు సైతం జరిగాయి. పంచాయతీ పెద్దలు పలుమార్లు భర్తను మందలించారు. వారికి ఓ సంతానం సైతం ఉంది. భార్యను చంపిన అనంతరం సతీష్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

English summary
A husband killed his wife at Ramagundam of Karimnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X