స్పీకర్ను కలవం, నేరుగా ప్రజాక్షేత్రానికే: జగన్ వర్గం

రాజీనామా, అనర్హత వేటు విషయాన్ని స్పీకర్ విచక్షణకే వదిలేస్తున్నామన్నారు. స్పీకర్ మా రాజీనామాలు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజారాజ్యం పార్టీ అనేది లేనప్పుడు తాను ఎవరికి వివరణ ఇస్తానని శోభా నాగి రెడ్డి ప్రశ్నించారు. చిరంజీవి పిఆర్పీ అధినేతగా ఉంటే తాను వివరణ ఇచ్చేందుకు సిద్ధమన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రైతులపై ప్రేమతో అవిశ్వాసం పెట్టలేదని తమను ఇబ్బందులకు గురి చేసేందుకే పెట్టారన్నారు. జగన్ను ఎదుర్కోలేక బాబు కాంగ్రెసు చేతులు కలిపాయన్నారు. తన ఆస్తులపై సిబిఐ విచారణ వేస్తే హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్న బాబుకు ఇతరుల అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కాగా భేటీ సమయంలో గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్తో ఎమ్మెల్యేలు పలుమార్లు ఫోన్లో చర్చించారు. సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలకు నిర్ణయాన్ని ఫోన్ ద్వారా తెలిపారు.












Click it and Unblock the Notifications