గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తులసి మొక్కలా పెరుగుదామని నాచెల్లితో చెప్పా: జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: రాబోయే ఉప ఎన్నికల్లో తమ పార్టీని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెసు పార్టీ పెద్దలు కలిసికట్టుగా ఒక్కటై కుట్రలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో విమర్శించారు. కొన్ని సీట్లలో మీరు పోటీ చేయండి మరికొన్ని సీట్లలో మేం పోటీ చేస్తాం అని ఈ రెండు పార్టీల పెద్దలు అప్పుడే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. రైతులకు అండగా ఉండేందుకే టిడిపి పెట్టిన అవిశ్వాసానికి తన వర్గం మద్దతు పలికిందన్నారు. వచ్చే ఉప ఎన్నికల్లో విలువలకు పట్టం కడతామని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్యనో, రెండు పార్టీల మధ్యనో జరుగుతున్న ఎన్నికలు కావన్నారు.

పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే సుచరిత గొప్ప పని చేసి ఇవాళ మీ ముందు నిలబడిందన్నారు. అవిశ్వాసానికి ముందు సుచరిత హైదరాబాద్ వెళ్తున్నప్పుడే తాను ఆమెతో... టిడిపి ఏ ఉద్దేశ్యంతో అవిశ్వాసం పెట్టినా విలువలు, విశ్వసనీయత ఉండాలని సూచించానని అన్నారు. రైతులు కష్టాలు పడుతున్నారు, పేదలు కన్నీళ్లు పెడుతున్నారని వీరికి తోడుగా నిలబడదామని ఆమెతో అన్నానని చెప్పారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మనం తులసి మొక్కగా పెరుగుదామని నా చెల్లి సుచరితకు చెప్పానని అన్నారు. డిస్ క్వాలిఫై అవుతామని తెలిసినప్పటికీ ప్రజల బాధలు ఢిల్లీ పెద్దలకు తెలిసి రావాలనే అవిశ్వాసానికి మద్దతిచ్చామన్నారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy said that he was suggested Sucharitha when TDP proposed no-confidence motion on Kiran's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X