చెన్నారెడ్డికి నివాళులర్పించని కిరణ్రెడ్డి: మర్రి అసంతృప్తి

స్పీకర్ నాదెండ్ల మనోహర్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతా రెడ్డి, దానం నాగేందర్ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా నివాళులు అర్పించారు. నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఇందుకోసం మర్రి శశిధర్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానించారు. అయినప్పటికీ కిరణ్ మాజీ సిఎంకు నివాళులు అర్పించలేదు.
దీంతో మర్రి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో, ఆవేదనతో ఉన్నారు. చెన్నారెడ్డికి కాంగ్రెసు మాజీ ముఖ్యమంత్రిలు, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సహా అందరూ ప్రతి వర్ధంతి రోజు నివాళులు అర్పించే వారని, కిరణ్ మాత్రం నిర్లక్ష్యం చేయడం సరికాదని మర్రి వర్గీయులు చెబుతున్నారు. వైయస్ సహా అందరూ విగ్రహం వద్దకు వచ్చి నివాళులు అర్పించే వారని గుర్తు చేస్కుంటున్నారు. ఇటువంటి వారి వల్లనే తెలంగాణకు ఆజ్యం పోసినట్లవుతుందని మర్రి వర్గీయులు కిరణ్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఏదో మనసులో పెట్టుకొని కిరణ్ ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఉన్నందునే హాజరు కాలేదని ముఖ్యమంత్రి వర్గీయులు చెబుతున్నారు. కాగా గాంధీ భవనంలో మర్రి చెన్నారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బొత్స, కేంద్రమంత్రి చిరంజీవి తదితరులు నివాళులు అర్పించారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications