వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెన్నారెడ్డికి నివాళులర్పించని కిరణ్‌రెడ్డి: మర్రి అసంతృప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - Marri Sashidhar Reddy
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నా రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నివాళులు అర్పించక పోవడం మర్రి కుటుంబ సభ్యులకు ఆగ్రహం తెప్పించిందట. ఈ రోజు మర్రి చెన్నా రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఇందిరాపార్కు సమీపంలో ఉన్న ఆయన ఘాట్ వద్ద పలువురు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.

స్పీకర్ నాదెండ్ల మనోహర్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతా రెడ్డి, దానం నాగేందర్ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా నివాళులు అర్పించారు. నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఇందుకోసం మర్రి శశిధర్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానించారు. అయినప్పటికీ కిరణ్ మాజీ సిఎంకు నివాళులు అర్పించలేదు.

దీంతో మర్రి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో, ఆవేదనతో ఉన్నారు. చెన్నారెడ్డికి కాంగ్రెసు మాజీ ముఖ్యమంత్రిలు, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సహా అందరూ ప్రతి వర్ధంతి రోజు నివాళులు అర్పించే వారని, కిరణ్ మాత్రం నిర్లక్ష్యం చేయడం సరికాదని మర్రి వర్గీయులు చెబుతున్నారు. వైయస్ సహా అందరూ విగ్రహం వద్దకు వచ్చి నివాళులు అర్పించే వారని గుర్తు చేస్కుంటున్నారు. ఇటువంటి వారి వల్లనే తెలంగాణకు ఆజ్యం పోసినట్లవుతుందని మర్రి వర్గీయులు కిరణ్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఏదో మనసులో పెట్టుకొని కిరణ్ ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఉన్నందునే హాజరు కాలేదని ముఖ్యమంత్రి వర్గీయులు చెబుతున్నారు. కాగా గాంధీ భవనంలో మర్రి చెన్నారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బొత్స, కేంద్రమంత్రి చిరంజీవి తదితరులు నివాళులు అర్పించారు.

English summary
CM Kiran Kumar Reddy has did not paid condelence to former minister Marri Chenna Reddy on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X