చనిపోయాడనుకొని అంత్యక్రియలు నిర్వహించారు, కానీ, బతికొచ్చాడు, ఏం జరిగింది?
చనిపోయాడని ఓ వ్యక్తికి అంత్యక్రియలు కూడ నిర్వహించారు.అతడిని తలుచుకొంటూ బాధపడుతున్నారు.అయితే చనిపోయాడనుకొన్న వ్యక్తి తిరిగి వచ్చాడు. దీంతో ఆ కుటుంబసభ్యులు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నారు.
నెల్లూరు: చనిపోయాడని ఓ వ్యక్తికి అంత్యక్రియలు కూడ నిర్వహించారు.అతడిని తలుచుకొంటూ బాధపడుతున్నారు.అయితే చనిపోయాడనుకొన్న వ్యక్తి తిరిగి వచ్చాడు. దీంతో ఆ కుటుంబసభ్యులు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకొంది.
నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని పొక్కందల గ్రామానికి చెందిన పుల్లయ్య, పద్మమ్మ దంపతుల చిన్న కుమారుడు ముళి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.మురళికి భార్య మాధవి, ఏడాది వయస్సున్న పాప ఉన్నారు.

నెల రోజుల క్రితం విధుల కోసం ఇంటి నుండి వెళ్ళిన మురళి ఆ తర్వాత ఆచూకీ లేకుండాపోయాడు. అయితే గత నెల 25న, సైదాపురం అటవీ ప్రాంతంలోని పల్లెమిట్ట గని గుంతలో ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు.
పోస్టుమార్టం తర్వాత మురళి కుటుంబసభ్యులు కూడ వెళ్ళి మృతదేహన్ని చూశారు.శరీరంపై ఉన్న గుర్తులు మృతదేహంపై ఉన్న ఆనవాళ్ళతో సరిపోలడంతో ఆ మృతదేహం మురళిదే అని నిర్ధారించారు.మృతుడి తల కింద పొత్తి కడుపులో ఆపరేషన్లు జరిగాయి. మృతదేహంపై కూడ అదే బాగాల్లో మృతదేహంపై ఆపరేషన్ల గాట్లు ఉండడంతో మురళిదే మృతదేహమని భావించారు.గత నెల 26, అంత్యక్రియలు నిర్వహించారు.
రావూరుకు శనివారం నాడు శీతలపానీయాల లోడు లారీ వచ్చింది. ఆ లారీలో మురళి ఉండడాన్ని చూసిన బంధువులు కుటుంబసభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. అతడి ఫోటోను కూడ పంపారు. ఆ లారీ చిత్తూరు జిల్లా ఏర్పేడు సమీపంలో ఉన్న శీతలపానీయాల గోదాము వద్దకు వెళ్ళింది.
దీంతో కుటుంబసభ్యులు కూడ అక్కడికి వెళ్ళి మురళిని కలుసుకొన్నారు. రాత్రి ఇంటికి తీసుకువచ్చారు.అయితే తాము అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహం ఎవరదనే విషయం కుటుంబసభ్యులకు అంతుపట్టడం లేదు. మరోవైపు చనిపోయాడని భావించిన వ్యక్తి బతికుండడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications