అమరావతి రైతులకు రుణాల పై కీలక నిర్ణయం, బిగ్ రిలీఫ్ - ఇక నుంచి..!!
రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు కీలక హామీ దక్కింది. రుణాల విషయంలో వెసులు బాటు కలిగింది. అమరావతి ప్రాంతంలో రైతుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదే విధంగా కొత్తగా పెన్షన్ల మంజూరు.. హెల్త్ కార్డుల పైన స్పష్టత లభించింది. భూ వివాదాలకు సంబంధించి త్వరలోనే పరిష్కారం చూపిస్తామని రైతులకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ హామీ ఇచ్చింది.
రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై త్రీ మెన్ కమిటీ ఈరోజు (శనివారం) సమీక్ష నిర్వహించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని కీలక అంశాలను వెల్లడించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు 30 ఏళ్ల పాటు లింకు డాక్యుమెంట్ లేకుండానే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించాయని వెల్లడించారు. రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి సీఆర్డీఏ ఇచ్చే డాక్యుమెంట్ ఆధారంగానే రుణాలు ఇచ్చేందుకు సమ్మతించాయని ప్రకటించారు. కాగా, జరీబు భూ సమస్యలపై సర్వే పూర్తయిందన్నారు. జరీబు భూములపై జెన్యూన్గా ఎవరికి ఇవ్వాలి అనేదానిపై కమిటీ రిపోర్ట్ తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. పది సెంట్లు కంటే తక్కువ ప్లాట్లు ఉన్నవాళ్లు 415 మంది ఉన్నారని... వారి సమస్యలు కూడా పరిష్కరిస్తున్నామన్నారు. 2013 కంటే ముందు భూములు ఇచ్చిన రైతులు కూడా తమను ల్యాండ్ పూలింగ్ కింద పరిగణించమని అడుగుతున్నారని... కానీ అవి చట్టపరంగా సాధ్యం కావడం లేదని వివరించారు.

కాగా..వీధి పోటు భూములకు సంబంధించి సుమారు 150 ఉన్నాయని.. వీధి పోటుకు సంబంధించి మరో రెండు అంశాలు రైతుల కోరుతున్నారని. ఆ అంశాలను తర్వాత పరిగణిస్తామని స్పష్టం చేశారు. త్రీ మెన్ కమిటీ నిర్ణయం ప్రకారం తిరిగి లంక భూముల విషయంలో 356కు గాను 79 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. మిగిలిన వారిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోమని కోరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమస్యలపై కూడా ఈ రివ్యూలో చర్చించినట్లు తెలిపారు. లార్జ్ రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని.. పరిష్కారం దిశగా వర్క్ చేస్తున్నామన్నారు. ఎవరెవరికి పెన్షన్లు మిస్ అయ్యాయో వాటి వివరాలు సేకరిస్తున్నా మని చెప్పారు. అలాగే కొత్తగా పెళ్లయిన వారికి కూడా పెన్షన్లు అందజేయాలని చూస్తున్నామని చెప్పారు. భూమి ఇచ్చిన వారికి బిలో పావర్టీ లైన్ తో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు.
-
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
అమరావతి పై వెంకయ్య కీలక ప్రతిపాదన, అమిత్ షా అంగీకారం..!! -
ఏపీ రాజధానిని మళ్లీ మార్చుకోవచ్చా ? అమరావతి గెజిట్ కూడా సరిపోదా ? -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications