Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతికి బ్యాంకుల క్యూ..!హాజరైన నిర్మల-అన్ స్టాపబుల్ అన్న సీఎం..!

ఏపీ రాజధాని అమరావతిలో త్వరలో నిర్మించనున్న 15 బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవాళ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి శంఖుస్థాపన చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు, అమరావతి రైతులు కూడా పాల్గొన్నారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాలతో ఆర్ధిక కేంద్రంగా అమరావతి మారుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు ..పూర్వోదయ స్కీంతో ఆదుకోవాలని, పోలవరం-నల్లమల సాగర్ కు సాయం చేయాలని కోరారు.

రైతుల త్యాగం, కేంద్ర ప్రభుత్వ సహకారం, పక్కా ప్రణాళికతో అమరావతి ఆన్ స్టాపబుల్ గా అభివృద్ధి సాధిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గత పాలకుల విధ్వంసం తర్వాత వెంటిలేటర్ మీదున్న రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడానికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందించిందని సీఎం అన్నారు. రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్లానెటోరియం నిర్మాణానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, చంద్రబాబు సమక్షంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ సంస్థ-సీఆర్డీఏలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి.

Chandrababu Nirmala laid foundation for 15 banks and firms in Amaravati farmers key requests

ప్రధాని మంత్రి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనుల్ని ప్రారంభించామని, ప్రస్తుతం రాజధాని నిర్మాణ పనులు స్పీడ్ అందుకున్నాయని చంద్రబాబు తెలిపారు. పనులు ఈ స్థాయిలో జరుగుతున్నాయంటే దానికి కారణం కేంద్ర నిర్మలా సీతారామన్ అన్నారు. రూ.15 వేల కోట్లను రాజధాని పునర్నిర్మాణానికి ఆమె కేటాయించారన్నారు. నిధులకు ఇబ్బంది లేకుండా సహకరించిన కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

Chandrababu Nirmala laid foundation for 15 banks and firms in Amaravati farmers key requests

15 ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా సంస్థలు అమరావతిలో ప్రధాన కార్యాలయాల భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంసంతోషంగా ఉందన్నారు. రూ.1,334 కోట్లతో బ్యాంకులు, బీమా కంపెనీల ఏర్పాటుతో 6,556 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయన్నారు. మరోవైపు అమరావతి రైతులు గత ప్రభుత్వ విధానాల కారణంగా తమకు రావాల్సిన క్యాపిటల్ గెయిన్స్ అందుకోలేక పోయారని చంద్రబాబు తెలిపారు. క్యాపిటల్ గెయిన్స్ గడువును మరికొంత కాలం పొడిగించాలని ఆర్ధికమంత్రి నిర్మలను కోరారు. క్యాపిటల్ గెయిన్స్ ప్రయోజనాలను రైతులు పొందేలా చూడాలన్నారు. ఇవన్నీ జరిగితే అమరావతి అన్ స్టాపబుల్ అవుతుందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+