జగన్‌ను దేవుడే రక్షించాలి: గాదె, మా హక్కు: హర్ష

Gade Venkat Reddy
హైదరాబాద్/ న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను దేవుడే రక్షించాలని మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు గాదె వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లును ముందుగా అసెంబ్లీలో ప్రవేశపెడతారని, ఆ తర్వాత చర్చ జరపడం ఓటింగ్ పెట్టడం ఆనవాయితీ అని ఆయన తెలిపారు. చర్చ జరగకుండానే ఓటింగ్ పెట్టాలనడం వైయస్సార్ కాంగ్రెసు మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. సభను వైయస్సార్ కాంగ్రెసు అడ్డుకుంటే బయటికి పంపించైనా చర్చ జరగాలని కోరతామని గాదె తెలిపారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) సమావేశానికి వెళ్లడం తమ హక్కు అని, పార్టీ సభ్యులుగా ఉన్నంతవరకు తమను ఎవరూ అడ్డుకోలేరని పార్లమెంట్ సభ్యడు హర్షకుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు ఉన్న హక్కుల మేరకే పాసులు పొందామని అన్నారు.

సమావేశంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరసన తెలిపామని ఆయన తెలిపారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాంగ్రెస్ అధిష్టానం గౌరవిస్తుందని భావిస్తున్నామని హర్షకుమార్ వ్యక్తం చేశారు.

ఎఐసిసి సమావేశానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్ పాస్‌లు లేకుండానే హాజరయ్యారు. సమైక్యాంధ్ర ప్లకార్డులతో ఎంపీలు సమావేశంలో నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా తెలంగాణ ఎంపీలు జై తెలంగాన నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+