కెసిఆర్ను కల్సిన హరి, కళ్యాణ్రామ్: టిడిపిలోనే వర్మ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తెలుగుదేశం పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ, ఆయన తనయుడు, హీరో నందమూరి కళ్యాణ్ రాంలు గురువారం ఉదయం కలిశారు.
గవర్నర్కు హరీష్ రావు లేఖ
గవర్నర్ నరసింహంకు తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. కేంద్రం ప్రకటించే ప్రాజెక్టుల్లో తెలంగాణకు వాటా ఇవ్వాలని కోరారు. విద్యుత్ పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని, డిస్కం, జెన్కో విభజన పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

టిడిపిలోనే స్వతంత్ర ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కలిశారు. స్వత్రంత్ర అభ్యర్థిగా గెలుపొందినప్పటికీ, తాను టిడిపి ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చెప్పారు. టిడిపి తరపున టికెట్ రాకపోవడంతో వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందారు.
చంద్రబాబుతో సిఎస్ మహంతి భేటీ
చంద్రబాబుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గురువారం ఉదయం సమావేశమయ్యారు. వచ్చే నెల 2 నుంచి రెండు రాష్ట్రాలు ఏర్పడనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు విభజన ప్రక్రియ ఎంతవరకు వచ్చింది.
జూన్ రెండు వరకు ప్రక్రియ పూర్తిపై చంద్రబాబుకు సీఎస్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరణ ఇచ్చారు. ఉద్యోగ పంపిణీ, ఇతర కీలకఅంశాలతో పాటు, కొత్త రాజధాని, ఇత మౌలిక అంశాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications