బిజెపి వైపు కెఏ పాల్ చూపు, పార్టీ అగ్రనేతలతో భేటీ
బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్, అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, నరేంద్ర మోడీ తదితరులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను అద్వానీ, రాజ్ నాథ్, మోడీ తదితరులను కలిశానని చెప్పారు. తనను వారు బిజెపిలోకి ఆహ్వానిస్తున్నారని తెలిపారు.
తాను తన కార్యకర్తలు, తన వారితో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటానని కెఏ పాల్ చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధాని కావాలనుకుంటున్నట్లు కెఏ పాల్ చెప్పినట్లుగా తెలుస్తోంది.
కాగా, కెఏ పాల్ ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకులు. ఆయనకు వైయస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబంతో వైరం ఉంది. ఆయన జగన్ పైన పలు సందర్భాల్లో మాటల దాడి చేశారు. సోదరుడి హత్య కేసులో ఆయనను గతంలో పోలీసులు అరెస్టు చేశారు.
దేశవ్యాప్తంగా బిజెపి హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా పలువురు నరేంద్ర మోడీ, బిజెపిల వైపు చూస్తున్నారు. టాలీవుడ్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతు ప్రకటించారు. నాగార్జున సోమవారం సాయంత్రం మోడీతో భేటీ కానున్నారు. కెఏ పాల్ ఇప్పుడు బిజెపిలో చేరడానికి ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం.