తాటతీస్తాం... మీసం మెలేసి బాలకృష్ణకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి జయరాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల సమరం కొనసాగుతోంది. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ భేరి పేరుతో బస్సు యాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి, ప్రతిపక్ష టిడిపిని తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తుంటే, రెండు రోజుల పాటు సాగిన మహానాడులో వైసీపీపై నిప్పులు చెరిగారు టిడిపి నేతలు.
తాజాగా స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పాల్గొన్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ సర్కార్ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు.వైసిపి ప్రభుత్వం గుడిని, గుడిలో లింగాన్ని మింగేసే రకం అంటూ బాలకృష్ణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేశారు. ఒక ఛాన్స్ అంటే ఒక తప్పిదం చేశారని, ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారని, ప్రజలు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని బాలకృష్ణ ప్రజలకు సూచించారు.
ఓటు అంటే నోటు కాదు అని తెలుసుకోవాలని బాలయ్య ప్రజలకు హితవు పలికారు. ఈ సారైనా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బాలయ్య సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతుందని మరుగుదొడ్ల పైన కూడా పన్నులు వేసే పరిస్థితి వచ్చిందని బాలకృష్ణ మండిపడ్డారు.

ఇక బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి గుమ్మనూరు జయరాం రివర్స్ కౌంటర్ ఇచ్చారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగుతున్నారని బాలయ్య ఆరోపణలు చేస్తున్నారని ఆయనను వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో ఓడించి తీరుతామని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టంచేశారు. మీసం మెలేసి చెప్తున్నా, బాలకృష్ణ తాటతీస్తామంటూ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. బీసీలంతా కలిసి బాలయ్య పని పడతారని పేర్కొన్నారు.
జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయం అంటూ గుమ్మనూరు జయరాం జోస్యం చెప్పారు. సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలకు జనం రావడం లేదని టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మహిళలతో తిట్టిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. జగన్ గెలిస్తే బీసీలు గెలిచినట్టు అంటూ పేర్కొన్న మంత్రి గుమ్మనూరు జయరాం బాలకృష్ణను ఓడించడం ఖాయమంటూ తేల్చి చెప్పారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications