అందరికీ న్యాయం జరుగుతోందా: 'చంద్రన్న'పై మోదుగుల సంచలనం
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సోమవారం నాడు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కేబినెట్ విస్తరణ జరిగినప్పటి నుంచి పలువురు నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
గుంటూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సోమవారం నాడు తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కేబినెట్ విస్తరణ జరిగినప్పటి నుంచి పలువురు నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
కేబినెట్ విస్తరణ పైనే కాకుండా తమకు ఉన్న అసంతృప్తిని నేతలు ఇప్పుడు బయట పెడుతున్నారు. ఈ రోజు గుంటూరులో నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే మోదుగుల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అసంతృప్తితో ప్రసంగం చేశారు. చంద్రన్న బీమా పథకంతో అందరికీ న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నించారు. కార్మికులు కాని వారే ఎక్కువగా బీమా పథకాన్ని వాడుకుంటున్నారన్నారు.
అయితే మోదుగుల అసంతృప్తి పార్టీ పైన కాకుండా అధికారుల పైన ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే తమ పాలనలో... చంద్రబాబు పేరు మీద పెట్టిన పథకం పైనే ఆయన అసంతృప్తి వెళ్లగక్కడం గమనార్హం.
గుంటూరు హోటళ్లలో బాలకార్మికులు పని చేస్తుంటే పట్టించుకునే వారే లేరన్నారు. మిరప తొడిమలు తీసే 25 వేల మందికి కార్మిక చట్టాలు వర్తించవా? అని ప్రశ్నించారు.
బజరంగ్ జూట్ మిల్ లాకౌట్తో 1500 మంది రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. జూట్ మిల్ కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మోదుగుల మండిపడ్డారు.
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications