ఇసుక మాఫియానా... మజాకా: 1700 ఎకరాలు దర్జాగా కబ్జా
చిత్తూరు:ఇసుక మాఫియా రెచ్చిపోతోంది...తమ అక్రమార్జన కోసం దళిత,గిరిజన, ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుంటూ సాండ్ మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతోంది. పైగా దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా అన్ని ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఈ దందాలో భాగస్వాములు కావడం...ఈ అక్రమార్కులకు ప్రభుత్వ అధికారుల తోడ్పాటు లభించడంతో ఇక ఈ అవినీతి అంతులేని కథగా మారిపోయింది.
ఇంతకీ ఈ కబ్జాకోరులు ఇప్పటివరకు స్వాహా చేసిన భూమి ఎన్ని ఎకరాలో తెలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే...100 కాదు 1000 కాదు ఏకంగా 1700 ఎకరాలకు పైగా ఈ దందాకోరులు కబ్జా చేసారంటే పరిస్థితి ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు. ఈ భూముల కబ్జాను ఎమ్మార్వో కూడా ధృవీకరించడం గమనార్హం.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం కందాడ పంచాయతీలో జరిగిన భూ భాగోతమిది. వివరాల్లోకి వెళితే...

ఇసుక మాఫియా అడ్డా...వెరీ ఫేమస్
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం అంటేనే ఇసుక మాఫియాకు అడ్డాగా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో బాగా పెట్టింది పేరు. గత ఏడాది ఏప్రిల్ లో పోలీస్ స్టేషన్ వద్ద ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వచ్చిన ఏర్పేడు వాసులపై లారీ దూసుకెళ్లిన ఘటనతో ఈ ప్రాంతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ధర ఇక్కడ ఇసుకాసురులు రెవెన్యూ శాఖలో కొందరు అధికారుల అండదండలతో 15 ఏళ్లుగా ప్రభుత్వ, దళిత, గిరిజనుల భూములను ఆక్రమించుకుంటున్నట్లు బైటపడింది.తాజాగా జరిపించిన రెవెన్యూ అధికారుల సర్వేలోనూ ఈ విషయం నిర్థారణ అయింది. కందాడ రెవెన్యూ శాఖ పరిధిలోని సర్వే నెంబర్ 246 కు సంబంధించి రాచపాళ్యం, వెంకటాపురం, కుక్కలోళ్లకండ్రిగ, వొర్రకాల్వ, సదాశివపురం, శివగిరి కాలనీలోని 1736 ఎకరాల ప్రభుత్వ డికెటి, దళిత, గిరిజనుల భూములను ఇసుక మాఫియా కబ్జా చేసినట్లు తేలింది.

మొత్తం 1736 ఎకరాలు...కబ్జా కోరల్లో...
ఈ 1736 ఎకరాలలో దళిత, గిరిజనులకు సంబంధించిన భూములు 822 ఎకరాలు కాగా మిగిలిన 914 ఎకరాలు ప్రభుత్వ భూములు. ఈ భూములను ఏర్పేడు మండలంలోని టిడిపి, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ నాయకులు అందరూ సిండికేట్ అయ్యి మరీ ఆక్రమించేయడం గమనార్హం. వీరంతా కలసి రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ పాసు పుస్తకాలను సృష్టించి ఒక్కొక్కరూ 15 నుంచి 25 ఎకరాలు ఆక్రమించుకున్నారంటే దందా ఏ మేరకు జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.

బెదిరింపులు...ప్రలోభాలు...
బెదిరింపులు...ప్రలోభాలు...స్వాహా ఆక్రమణలకు పాల్పడటమే కాదు ఈ భూముల్లో ఏకంగా ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటూ మామిడి, అరటి, శనగ పంటలను సైతం పండిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. తమ భూములను కాపాడుకునేందుకు ప్రయత్నించిన కొంతమంది దళితులను బెదిరించి మరీ భూములను లాగేసుకోవడం గమనార్హం. ఇంకొంతమంది ఇక్కడి దళిత,గిరిజనుల పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.20వేల చొప్పున డబ్బులిచ్చేసి భూములు సొంతం చేసేసుకున్నట్లు తెలిసింది.

కబ్జా నిజమే...ఎమ్మార్వో నిర్థారణ
ఈ భూ కబ్జా కేవలం ఆరోపణలు కాదని యదార్థమేనని ఏర్పేడు ఎమ్మర్వో శేషగిరిరావు నిర్థారించారు. కందాడ పంచాయతీ సర్వే నెంబర్ 246 కింద 1736 ఎకరాల ప్రభుత్వ, దళిత గిరిజనుల భూములను 20 ఏళ్ల క్రితం నుంచి ఆక్రమించుకుంటున్నారని తమ రికార్డుల్లో తేలిందని చెప్పారు. కొందరు నకిలీ పట్టాలను సృష్టించుకుని ఎన్నో ఏళ్లుగా ఈ భూములను అనుభవిస్తున్నారని తమ విచారణలో తేలినట్లు వెల్లడించారు. రెవెన్యూ శాఖలో కొంతమంది అధికారులు సహకరించడం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. అయితే ఈ భూములను తాము తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని, ఇప్పటివరకూ గడచిన నెలరోజుల్లో 60ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని, అయితే తమకు ఒకే సర్వేయర్ ఉండడం వల్ల భూముల స్వాధీనంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నట్లు
వెల్లడించారు. అయితే ఈ భూ ఆక్రమణలకు సంబంధించి నివేదిక తయారు చేసి కలెక్టర్కు పంపించామని ఎమ్మార్వో శేషగిరిరావు తెలిపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications