తక్షణమే దర్గాల అభివృద్ధి చేయకుంటే ఆందోళనే:సుఫీ మతగురువు అలీ రజా హెచ్చరిక
అమరావతి: రాష్ట్ర విభజన జరిగాక అంధ్రప్రదేశ్ కు ప్రత్యేక వక్ఫ్బోర్డు ఏర్పడినప్పటికీ రాష్ట్రంలో దర్గాలు దయనీయ స్థితిలోనే కొనసాగడం విచారకరమని సుఫీ మతగురువు మహమ్మద్ అల్తఫ్ అలీ రజా అవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆదాయం పెద్దగా రాని దర్గాలను సైతం ప్రభుత్వం అభివృద్ది చెయ్యాల్సి వుండగా...ఆదాయం బాగా వచ్చే పెదకాకాని హజరత్ బాజీబాబా వారి దర్గా వంటి వాటిలో కూడా కనీస వసతులు లేకపోవడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. దర్గాల నుంచి వచ్చే ఆదాయం ద్వారా జీతాలు తీసుకుంటున్న వక్ఫ్ అధికారులు...దర్గాల ప్రాంగణాల అభివృద్దిపై ఎందుకు దృష్టి సారించడం లేదో అర్థం కావడం లేదన్నారు.

దర్గాల ద్వారా వచ్చే ఆదాయం వల్ల లబ్ధి పొందుతూ వాటి అభివృద్దికి ఎందుకు ఖర్చు పెట్టడం లేదో భక్తులకు తెలియజేయాల్సిన బాధ్యత వక్ఫ్ అధికారులపై ఉందన్నారు. పెదకాకాని దర్గా విషయంలో వక్ఫ్ బోర్డు అధికారులు వెంటనే స్పందించకుంటే తాను భక్తులతో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతానని సుఫీ మతగురువు మహమ్మద్ అల్తఫ్ అలీ రజా ఆ ప్రకటనలో హెచ్చరించారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications