కాకినాడ ఎంపి డెబిట్ కార్డు క్లోనింగ్: గోవాలో రూ. 50వేల డ్రా, సిఐడికి ఫిర్యాదు
తూర్పుగోదావరి: కాకినాడ ఎంపి తోట నర్సింహం డెబిట్ కార్డ్ క్లోనింగ్కు గురైంది. తోట నర్సింహంకు చెందిన డెబిట్ కార్డును క్లోనింగ్ చేసిన ఆగంతకులు, ఆయన ఖాతా రూ. 50వేలు డ్రా చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో తన కార్డు క్లోనింగ్ జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులకు తోట నర్సింహం ఫిర్యాదు చేశారు. దీంతో మోసానికి పాల్పడిన సైబర్ నేరగాళ్ల కోసం సిఐడి గాలింపు చేపట్టింది. నిందితులు గోవాలోని ఓ ఏటిఎం నుంచి రూ. 50వేలు డ్రా చేసుకున్నట్లు తేలింది.

కాగా, 15రోజుల క్రితం తన ఖాతా నుంచి రూ. 50వేలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చిందని సిఐడికి ఇచ్చినట్లు ఫిర్యాదులో ఎంపి తోట నర్సింహం తెలిపారు. తాను ఇటీవల బెంగళూరులోని ఓ షాపింగ్ మాల్లో షాపింగ్ చేసిన సమయంలో తన డెబిట్ కార్డు క్లోనింగ్ జరిగి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాను షాపింగ్ చేసిన రెండు మూడు రోజులకే రూ. 50వేలు డబ్బు డ్రా చేసినట్లు తనకు మెసేజ్ వచ్చిందని నర్సింహం తెలిపారు. నిందితులు డ్రా చేసిన సమయంలో తన ఖాతాలో రూ. 13లక్షలకు పైగా నగదు ఉన్నట్లు తెలిపినట్లు సమాచారం. మెసేజ్ రావడంతో వెంటనే బ్యాంకు అధికారులను సమాచారం ఇచ్చి బ్లాక్ చేయించినట్లు చెప్పారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications