కాకినాడ ఎంపి డెబిట్ కార్డు క్లోనింగ్: గోవాలో రూ. 50వేల డ్రా, సిఐడికి ఫిర్యాదు
తూర్పుగోదావరి: కాకినాడ ఎంపి తోట నర్సింహం డెబిట్ కార్డ్ క్లోనింగ్కు గురైంది. తోట నర్సింహంకు చెందిన డెబిట్ కార్డును క్లోనింగ్ చేసిన ఆగంతకులు, ఆయన ఖాతా రూ. 50వేలు డ్రా చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో తన కార్డు క్లోనింగ్ జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులకు తోట నర్సింహం ఫిర్యాదు చేశారు. దీంతో మోసానికి పాల్పడిన సైబర్ నేరగాళ్ల కోసం సిఐడి గాలింపు చేపట్టింది. నిందితులు గోవాలోని ఓ ఏటిఎం నుంచి రూ. 50వేలు డ్రా చేసుకున్నట్లు తేలింది.

కాగా, 15రోజుల క్రితం తన ఖాతా నుంచి రూ. 50వేలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చిందని సిఐడికి ఇచ్చినట్లు ఫిర్యాదులో ఎంపి తోట నర్సింహం తెలిపారు. తాను ఇటీవల బెంగళూరులోని ఓ షాపింగ్ మాల్లో షాపింగ్ చేసిన సమయంలో తన డెబిట్ కార్డు క్లోనింగ్ జరిగి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాను షాపింగ్ చేసిన రెండు మూడు రోజులకే రూ. 50వేలు డబ్బు డ్రా చేసినట్లు తనకు మెసేజ్ వచ్చిందని నర్సింహం తెలిపారు. నిందితులు డ్రా చేసిన సమయంలో తన ఖాతాలో రూ. 13లక్షలకు పైగా నగదు ఉన్నట్లు తెలిపినట్లు సమాచారం. మెసేజ్ రావడంతో వెంటనే బ్యాంకు అధికారులను సమాచారం ఇచ్చి బ్లాక్ చేయించినట్లు చెప్పారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications