ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు
రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తోన్నాయి. గతంలో కర్నూలు వద్ద సంభవించిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 42 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. చేవెళ్ల వద్ద టీజీఎస్ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే వస్తోన్నాయి. సురక్షితంగా గమ్యస్థానం చేరుతామనే గ్యారంటీ ప్రయాణికులకు లేకుండా పోయింది.
తాజాగా- ఏపీలో మరో ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పింది. లారీనీ ఢీ కొట్టింది. రోడ్డుపై ఆగివున్న ఈ బస్సును మరో లారీ వేగంగా వచ్చి వెనుక వైపు నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఈ దుర్ఘటన సంభవించింది. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి బయలుదేరిన ప్రైవేట్ బస్సు ఆళ్లగడ్డ సమీపంలోని పేరాయిపల్లి మిట్ట వద్ద వేకువ జామున 1:30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. మైత్రీ ట్రావెల్స్ కు చెందిన బస్సు అది. మొదట బస్సు డ్రైవరు ముందు వెళ్తోన్న లారీని వేగంగా ఢీకొట్టాడు. దీంతో ఆగిపోయిన బస్సును వెనుకల వస్తోన్న మరో లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు మొత్తం నుజ్జునుజ్జు అయింది.
బస్సు వెనక సీట్లల్లో కూర్చొన్న ఇద్దరు మృతి చెందినట్లు చెందారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు కావడంతో డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకుపోయాడు. అతి కష్టం మీద అతన్ని బయటికి తెచ్చారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications