'అభ్యంతరంలేదని జగన్ యూ టర్న్, కిరణ్ను విమర్శిస్తే'
రాజకీయ లబ్ధి కోసమే జగన్, ఆయన పార్టీ నేతలు కిరణ్ను విమర్శిస్తున్నారని, కిరణ్ సమైక్యాంధ్ర వ్యతిరేకని బురద చల్లడం సరికాదన్నారు. పార్టీ ప్లీనరీలో తెలంగాణకు అభ్యంతరం లేదని చెప్పి ఇప్పుడు మాట మార్చారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కిరణ్ సమైక్య వాదాన్ని శంకించడమంటే సత్య హరిశ్చంద్రుని సత్య సంధతను, మహాత్ముడి అహింసా వాదాన్ని శంకించడమేనని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసి రెడ్డి అ న్నారు.
ఇటీవలి సర్వేలు, తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు విభజనపై పునరాలోచించాలని సూచించారు.
తాము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ను వీడేది లేదని మంత్రి శైలజానాథ్ చెప్పారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడిస్తామన్నారు. రాయలసీమ ప్రాంతం అన్ని ప్రాంతాల కంటే వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన ఆగిపోతుందని భావించడం లేదని, తమ రాజీనామాలతో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని అనుకోవడం లేదని సీమాంధ్ర కేంద్ర మంత్రులు వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి గంటా శ్రీనివాస రావు తప్పుబట్టారు.