ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 5 శాతం డీఏ పెంపు.. 48 వేల మందికి లబ్ది
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీసి కబురు చెప్పింది. ఉద్యోగులకు వేతనాలకు 5 శాతం డీఏ ఇవ్వనుంది. పెంచిన డీఏ వచ్చె నెల నుంచి కలిపి ఇస్తామని టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. మూల వేతనంపై 5 శాతం డీఏ చెల్లిస్తామని ఆర్టీసీ ప్రకటించింది. దీంతో సంస్థపై నెలకు రూ.5 కోట్ల భారం పడుతుందని వెల్లడించింది.
మూల వేతనంపై ఉద్యోగులందరికీ 5 శాతం డీఏ చెల్లించనుంది. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ వంటి యూనిఫారం ఉద్యోగులకు కనిష్ఠంగా రూ.600 నుంచి గరిష్ఠంగా రూ.1,500 వరకు భత్యం జతకలువనుంది. వివిధ కేటగిరీల్లోని అధికారులకు రూ.1,500 నుంచి రూ.5,500 వరకు వేతనం అడిషనల్గా జమ కానుంది. డీఏ పెంపుతో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఆర్టీసీలో పనిచేస్తున్న 48 వేల మందితోపాటు 2019 జూలై నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఇటీవల బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఒక్కొక్కటి అమలు చేస్తుంది. ఆర్టీసీ చార్జీలను రౌండ్ ఫిగర్ చేయడం, డీజిల్ సెస్సు విధించడం ద్వారా సంస్థ ఆదాయం స్వల్పంగా పెరగడంతో కార్మికుల సంక్షేమంపై దృష్టిసారించింది. పెండింగ్లో ఉన్న 6 డీఏల్లో ప్రస్తుతానికి ఒకదాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications