పోలీసు రాత పరీక్ష ఫలితాలు విడుదల: ఎస్ఐ పోస్టుకు 46.80 శాతం పాస్
పోలీసు నియామకాలకు సంబంధించి రాతపరీక్ష ఫితాలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది. 554 ఎస్ఐ పోస్టులకు ఆగస్టు 7వ తేదీన, 15,644 కానిస్టేబుల్, 63 ట్రాన్స్పోర్టు కానిస్టేబుల్, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులకు ఆగస్టు 28న రాత పరీక్ష నిర్వహించారు. ఆ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి.

మొత్తం ఎస్ఐ పోస్టులకు 2,25,668 మంది రాత పరీక్ష రాయగా 1,05,603 (46.80 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 5,88,891 మంది రాత పరీక్ష రాయగా 1,84,861 (31.39 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్పోర్టు కానిస్టేబుల్ పోస్టులకు 41,835 మంది రాత పరీక్ష రాయగా 18,758 (44.84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 2,50,890 మంది రాత పరీక్ష రాయగా, 1,09,518 (43.65 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకల ట్యాగ్ లైన్ మీద. అయితే ఆశించిన మేర కొలువులు భర్తీ చేయడం లేదు. దీంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి. అందుకే సీఎం కేసీఆర్ భారీ ఉద్యోగ ప్రకటన చేశారు. అసెంబ్లీలో ఆ ప్రకటన చేసి.. మెల్లిగా నియామక ప్రక్రియ చేపడుతున్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications