ఆర్జేడీకి 16, జేడీయూకు 11 పోస్టులు.. ఇదీ మంత్రి మండలి లెక్క
బీహర్లో జేడీయూ- ఆర్జేడీ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీగా తేజస్వి యాదవ్ ప్రమాణం చేశారు. మంత్రుల శాఖలు, లెక్కలు ఇవాళ తేలింది. మంత్రివర్గ విస్తరణ మంగళవారం ఉదయం 11.30 గంటలకు జరగనుంది. నితీశ్, తేజస్వీ మధ్య లెక్క కుదిరింది.
కీలక శాఖలు తనకు కావాలని తేజస్విని నితీశ్ కుమార్ కోరినట్టు తెలుస్తోంది. ఆర్జేడీకి అసెంబ్లీలో స్థాన బలం ఉంది. అందుకే 16 మంత్రి పదవులను కట్టబెట్టింది. బీజేపీకి 16, జేడీయూ 11 సీట్లు వచ్చాయి.
హిందుస్థానీ అవామ్ మోర్చాకు మంత్రి పదవీ, కాంగ్రెస్ పార్టీకి రెండు పదవులు కావాలి. మొత్తం 31 మంది ఎమ్మెల్యేలు, మంత్రులుగా ప్రమాణం చేస్తారు. జేడీయూ నుంచి బిజేంద్ర ప్రసాద్ యాదవ్, విజయ్ చౌదరి, శ్రావణ్ కుమార్, అశోక్ చౌదరీ, మదన్ సాహ్ని, సంజయ్ కుమార్ ఝా, జామా ఖాన్, సుమిత్ కుమార్, లెషి సింగ్ ఉన్నారు.
ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్, సురేంద్ర యాదవ్, శశి భూషన్ సింగ్, భూదెవ్ చౌదరి, అనిత దేవి, కుమార్ సంజీవ్, అలోక్ మెహతా, షాహనాజ్ అలం, సుధాకర్ సింగ్, సమీర్ మహసెత్ ఉన్నారు.